మేము దూరంగా ఉన్నా మనసులు దగ్గరగా ఉన్నాయి.. రష్మి ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా రష్మి యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ తో రష్మికి ఉన్న లవ్ ట్రాక్ వల్ల వీరిద్దరూ బాగా పాపులర్ అయ్యారు. స్టేజి మీద ఇద్దరిమద్య ఉండే రిలేషన్ వల్ల వీరు నిజంగా ప్రేమలో ఉన్నారని ప్రేక్షకులు నమ్మారు. అంతే కాకుండా జబర్థస్త్ వేదికగా వీరిద్దరికీ ఎన్నోసార్లు పెళ్లి కూడా జరిగింది. వీరిద్దరూ ఒకరి గురించి ఒకరు చెబుతు చాలాసార్లు ఎమోషనల్ అయ్యారు. ఇక సుధీర్ తనకి రష్మి మీద ఉన్న ప్రేమని ఎన్నోరకాలుగా వ్యక్తపరిచారు.

సుధీర్, రష్మీ జోడిని చూడటానికి ప్రేక్షకులు కూడా ఎంత ఆసక్తిగా ఎదురుచూసేవారు. వీరిద్దరూ జీవితంలో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు అశపడుతున్నారు. అయితే రష్మి మాత్రం ఇదంత కేవలం ప్రేక్షకులని అలరించటానికే ఇలా చేసాము. మా ఇద్దరిమధ్య అలాంటి బంధం లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం అంటూ చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది. దీంతో వారి అభిమానులు చాలా నిరాశ చెందారు. అయితే కొందరు మాత్రం రష్మి, సుధీర్ మధ్య ఉన్న రిలేషన్‌ నిజమేనని , అల లేకపోతే లేకపోతే ఇన్నిసార్లు ఇలా రియాక్ట్ అవ్వరని, స్టేజ్‌పై వారి కెమిస్ట్రీ అద్బుతంగా పండేదని, మనసులో ఏమి లేకపోతే అలా రాదని అంటున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా రష్మి తనతో సుధీర్ ఉన్న రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రష్మి యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ షో కి సంబందించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో టీవీ సీరియల్స్, జబర్దస్త్ కమేడియన్లు జోడీగా మారి రొమాంటిక్‌ పాటలకు స్టెప్పులేశారు. ఇవన్నీ చూశాక నువ్వేమన్నా మిస్‌ అవుతున్నావా? అని ఆది రష్మిని అడిగాడు. గతంలో సుధీర్‌, చేసిన డ్యూయెట్ లు గుర్తొచ్చాయేమో అని అల అడిగాడు. అందుకు రష్మి సమధానం చెప్తూ.. మేము ఇద్దరు దూరంగా ఉన్నా కూడా మా మనసులు మాత్రం ఎప్పుడు కలిసే ఉంటాయి అని చెప్పింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.