పద్ధతిగా శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు చేసిన అనసూయ…. అదే కారణమా?

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. అయితే ఈమె సినిమాలతో బిజీగా ఉండటం వల్ల జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పి సినిమాలతో బిజీ అయ్యారు. అయితే ఈమె జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలిపెట్టినప్పటి నుంచి ఈమె నటించిన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి. దీంతో అనసూయ పరిస్థితి ఎటు కాకుండా ఉంది.పుష్ప సినిమాలో ఈమె నటించినప్పటికీ తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. అదేవిధంగా ఈమె నటించిన వాంటెడ్ పండుగాడు సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.

ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి అనసూయ ఇతర ఎలాంటి బుల్లితెర కార్యక్రమాలలో కూడా అవకాశాలు అందుకోలేక పోతుంది. అదేవిధంగా ఈమె నటించిన సినిమాలు కూడా సక్సెస్ కాలేకపోతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈమెకు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. దీంతో అనసూయ ఇంటర్వ్యూలకు కూడా చాలా దూరంగా ఉంటున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి అనసూయ తాజాగా శ్రీకాళహస్తిలో సందడి చేశారు.

ఈమె శ్రీకాళహస్తిలో బాలాజీ షాపింగ్ మాల్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అనంతరం ఈమె శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.ఈ ఆలయంలో అనసూయ సాంప్రదాయ బద్ధంగా చీర ధరించి ప్రత్యేకంగా పూజలు చేశారు. అయితే ఈమె జాతకంలో ఉన్నటువంటి దోష నివారణ కోసమే అనసూయ శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారని తెలుస్తోంది.