యాంకర్ గా చెల్లిని రంగంలోకి దింపుతున్న అనసూయ.. వైష్ణవి ఎంట్రీకి సర్వం సిద్ధం!

బుల్లితెర యాంకర్ గా అనసూయ భరద్వాజ్ గురించి తెలియని వారంటూ ఉండరు. మొదట న్యూస్ ప్రెసెంటర్ గా ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభించిన అనసూయ ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు పొందింది. దాదాపు తొమ్మిది సంవత్సరాలపాటు జబర్దస్త్ కి యాంకర్ గా వ్యవహరించిన అనసూయ.. జబర్దస్త్ వల్ల వచ్చిన గుర్తింపుతో సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకుంది. ఇలా రంగస్థలం క్షణం పుష్ప వంటి ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించి వెండితెర ప్రేక్షకులకు కూడా దగ్గర అయింది.

ఇదిలా ఉండగా అనసూయ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వారు..వారి వారసుల్ని, తోడబుట్టిన వారిని కూడా ఇండస్ట్రీలోకి తీసుకువస్తున్నారు. తాజాగా అనసూయ కూడా తన చెల్లిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అనసూయకు ఇద్దరు చెల్లెలు ఉండగా.. వారిలో వైష్ణవి అనే ఒక చెల్లి బాధ్యతను అనసూయ తీసుకున్నట్లు సమాచారం. తండ్రి మరణించడంతో తన చెల్లి బాధ్యతను భుజాన వేసుకున్న అనసూయ ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేసి తనలాగే యాంకర్ గా చూడాలని ఆశపడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారం కానున్న ఒక షో కి యాంకర్ గా తన చెల్లిని రికమెండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అచ్చం అక్క పోలికలతో చలాకీగా ఉండే వైష్ణవి కి మీడియా, ప్రొడక్షన్ తదితర విభాగాల్లో పని చేసిన అనుభవం వుంది. అందువల్ల వైష్ణవి ని యంకర్ గా ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనసూయ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. వైష్ణవి యాంకర్ గా ఇండస్ట్రీలో అడుగుపెడితే తన అక్క లాగే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.