పండగ పూట కుటుంబానికి దూరమైన అనసూయా.. వారితో కలిసి దీపావళీ సెలబ్రేషన్స్..?

బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట న్యూస్ ప్రజెంటర్ గా ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభించిన అనసూయ ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా అవకాశం దక్కించుకుంది. ఇలా దాదాపు తొమ్మిదేళ్లపాటు జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగుతూ తన అందాలతో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బుల్లితెర మీద ప్రసారమవుతున్న అనేక టీవీ షోలలో యాంకర్ గా సందడి చేసిన అనసూయకి సినిమాలలో నటించే అవకాశాలు కూడా దక్కాయి.

ఈ క్రమంలో ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించి నటిగా కూడా తన సత్తా నిరూపించుకుంది. ఇక సినిమాలు టీవీ షో లతో నిత్యం బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేయటమే కాకుండా తనకు నచ్చని విషయాల గురించి సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచు వార్తల్లో నిలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం దీపావళి పండుగ సందర్భంగా అనసూయ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీపావళి పండుగను సామాన్యులు, సెలబ్రిటీలు అని తేడా లేకుండా అందరూ ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇటీవల అమెరికా వెళ్లిన దీపావళి పండుగ రోజున కుటుంబానికి దూరంగా. అయితే ఈ దీపావళి పండుగను అమెరికాలో ఉన్న తన బంధుమిత్రులతో కలిసి అనసూయ ఎంతో ఆనందంగా జరుపుకుంది. అమెరికాలో దీపావళి పండుగ జరుపుకున్న అనసూయ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో అనసూయ నల్లటి చీరలో తెల్లటి మేని ఛాయతో కుందనపు బొమ్మల మెరిసిపోతోంది.