శ్రీముఖి ప్యాంట్ మర్చిపోయిందంటూ అందరి ముందు పరువు తీసిన నటి రమ్యకృష్ణ?

బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అదుర్స్ షో ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీముఖి ఆ తర్వాత బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఎన్నో టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చానల్ తో సంబంధం లేకుండా శ్రీముఖి అన్ని చానల్స్ లో ప్రసారమవుతున్న టీవి షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ తన మాటలతో చిలిపి చేష్టలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యి బుల్లితెర రాములమ్మగా గుర్తింపు పొందింది.

ఇక టీవీ షోలలో శ్రీముఖి తన యాంకరింగ్ తో పాటు అందాల ప్రదర్శనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని టీవీ షోలో సందడి చేస్తున్న శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా తన అందాలతో రచ్చ చేస్తూ ప్రేక్షకులను రెచ్చగొడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం శ్రీముఖి ఆహా లో ప్రసారమవుతున్న “డాన్స్ ఐకాన్” అనే రియాలిటీ షోలో టీం లీడర్ గా కొనసాగుతోంది. ఇక ఈ షోలో రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్, యశ్వంత్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా డాన్స్ ఐకాన్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఈ ప్రోమోలో రమ్య కృష్ణ అందరిముందూ శ్రీముఖి పరువు తీసింది. తాజాగా రిలీజ్ అయిన ఈ ప్రోమోలో శ్రీముఖి ముగ్గురు జడ్జిలతో కలిసి డాన్స్ చేసింది. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ శ్రీముఖి నువ్వు ఈరోజు ఏమైనా మర్చిపోయావా? వాచ్ కానీ.. మొబైల్ కానీ అని అంటుండగానే… రమ్యకృష్ణ మాట్లాడుతూ ప్యాంటు మర్చిపోయింది అని అందరి ముందు శ్రీముఖి పరువు తీస్తుంది. దీంతో యశ్వంత్ మాస్టర్ కూడా అక్కడ ఉన్న మోనాల్ గజ్జర్ ని నీ పక్క సీట్ లో ప్యాంట్ ఉందా ? అని అడుగుతాడు. ఇలా అందరు పరువు తీయటంతో శ్రీముఖి కాస్తా అవమానంగా ఫీల్ అయ్యింది.