బాబీ సినిమాను పక్కన పెట్టేసిన రజినీ..?

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, బాబీ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన బాబీకి మంచి మార్కులే పడ్డాయి. అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని అంతా మెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తర్వాత సినిమా తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ తో చేయబోతున్నట్లు ప్రకటించారు.

అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించి చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని వార్తలు వచ్చాయి. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా… తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న చిత్రం ఆగిపోయిందని తెలుస్తోంది.

సూపర్ స్టార్ రజినీ కాంత్ బాబీ చిత్రాన్ని పక్కన పెట్టేశాడని అంతా అనుకుంటున్నారు. కానీ ఎందుకు పక్కన పెట్టేశారనే దానికి అసలు కారణాలు మాత్రం వెల్లడించలేదు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. రజనీ కాంత్‌తో కలిసి పనిచేయాలని చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఒక్క ప్రాజెక్టు కూడా కార్యరూపం దాల్చలేదు. మరోవైపు డైరెక్టర్ బాబీ కూడా రజినీ కాంత్ తో సినిమాపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడరు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ జరగడం లేదు.

మరోవైపు రజినీ కాంత్ జైలర్ అనే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, మిల్క్ బ్యూటీ తమన్నా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించబోతున్నారు

ఆగస్టు వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకోనుందో చూడాలి. ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టారు రజినీ కాంత్. త్వరలోనే తమ తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కలిసి ఆయన పని చేయబోతున్నట్లు సమాచారం.