అతని వల్ల చనిపోవాలని అనుకున్నా.. డాన్స్ షో లో ఎమోషనల్ అయిన కండక్టర్ ఝాన్సీ..?

ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది తమ టాలెంట్ నిరూపించుకొని సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా కొంతమంది తమ టాలెంట్ నిరూపించుకొని రాత్రికి రాత్రే సెలబ్రిటీలు గా మారిపోతున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో గాజువాక కండక్టర్ ఝాన్సీ కూడా ఒకరు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పల్సర్ బైక్ పాటకు డాన్స్ చేసిన ఝాన్సీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని ఓవర్ నైట్ లో సెలబ్రిటీగా మారిపోయింది. ఇలా ఒక పాటతో ఫేమస్ అయిన ఝాన్సీ కి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.

బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలలో అవకాశాలు దక్కించుకోవడమే కాకుండా సినిమాలలో కూడా స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశాలు కూడా అందుకుంటుంది. ఇక ఇటీవల ఆహా వేదికగా ప్రసారమవుతున్న డాన్స్ ఐకాన్ అనే డాన్స్ రియాలిటీ షోలో కూడా తన సత్తా చూపించింది. ఆహా వేదికగా ప్రసారమవుతున్న ఈ డాన్స్ ఐకాన్ రియాలిటీ షోలో రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్, జడ్జిలుగా వ్యవహరించగా.. ఓంకార్ ఈ షోకి హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ షోలో శ్రీముఖి, యశ్వంత్ మాస్టర్, మోనాల్ గజ్జర్ టీం లీడర్లుగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈవారం ప్రసారం కానున్న ఎపిసోడ్స్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈవారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ లో శ్రీముఖి టీమ్ నుండి ఆసిఫ్ తో పాటు ఝాన్సీ కూడా పల్సర్ బైక్ పాటకు మాస్ డాన్స్ చేసి తమ పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక వీరి పర్ఫార్మెన్స్ కి రమ్యకృష్ణ ఫుల్ ఫిదా అయ్యి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ డాన్స్ చేసింది. ఇక ఈ షోలో ఝాన్సీ అందరి ముందు ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. తన తండ్రి వల్ల చాలాసార్లు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని అనుకున్నట్లు వెల్లడించింది. కానీ తన తమ్ముడు , తన తల్లి కోసం కష్టపడి డాన్సర్ గా మారటమే కాకుండా కండక్టర్ గా ఉద్యోగం సంపాదించుకొని జీవితంలో పైకి వచ్చానని చెబుతు ఎమోషనల్ అయ్యింది.