రష్మీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన నెటిజన్… పండగ చేస్కో అంటున్న రష్మి…!

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన రష్మీ ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా అవకాశం అందుకుంది. ఎన్నో ఏళ్లుగా జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో ల ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. ఇటీవల అనసూయ, సుధీర్ ఈటీవీ కి దూరమవడంతో ఈటీవీలో ప్రసారమవుతున్న అన్ని షోలలో రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తోంది. వారిద్దరు వెళ్లిపోవడంతో రష్మి లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు వారంలో ఆరు రోజులో ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షోస్ కోసం తన డేట్స్ కేటాయిస్తోంది.

ఇదిలా ఉండగా.. అందరి సెలబ్రిటీల లాగే రష్మీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. కాకపోతే ఈ అమ్మడు మూగజీవాల పట్ల ప్రేమను చూపిస్తూ ఎక్కువగా స్పందిస్తూ ఉంటుంది. అంతేకానీ తన గురించి వచ్చే నెగటివ్ కామెంట్స్ గురించి ఎప్పుడు స్పందించదు. కానీ అనసూయ మాత్రం తన గురించి వచ్చే నెగటివ్ కామెంట్స్ గురించి స్పందిస్తూ నెటిజన్స్ మీద ఫైర్ అవుతూ ఉంటుంది.ఇటీవల లైగర్ సినిమాని ఉద్దేశిస్తూ..’ అమ్మని అవమానపరిచిన ఉసురు ఊరికే పోదు అంటూ ‘ అనసూయ పోస్ట్ షేర్ చేసింది. దీంతో విజయ్ అభిమానులతో పాటు మరి కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాలో అనసూయని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో తన గురించి నెగిటివ్ కామెంట్స్ చేసిన వారి మీద, తనని ఆంటీ అంటు కామెంట్ చేసిన వారి మీద కేసు పెడతానంటు నెటిజన్స్ కి యాంటీ అవుతోంది.

అయితే రష్మి మాత్రం ఇలాంటి వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉంటుంది. అందువల్ల ఇటీవల రష్మి ని ఉద్దేశిస్తూ ఒక నెటిజన్ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. ‘ఎవరు ఏమన్నా పట్టించుకోవు..అసలు ఎవరికీ రిప్లయ్ ఇవ్వవు.. నీతో అస్సలు గొడవే లేదు.. అసలు నీకు తెలుగు అర్థం కాదు..’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. అయితే రష్మి ఈ ట్వీట్ కి స్పందిస్తూ “పండగ చేస్కో” అంటూ ఒక్క మాటలో సమధానం చెప్పింది. దీంతో రష్మి, అనసూయ కి మద్య చాలా తేడా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.