జీరోసైజ్‌కి మారిన నమిత

2002లో టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో పంజాబీ భామ నమిత ఆరంగేట్రం చేసింది. అనంతరం 2004లో విజయ్‌కాంత్‌ నటించిన ‘ఎంగల్‌ అన్నా’ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో ఈ అమ్మడు అడుగు పెట్టింది. అభిమానుల చేత ‘మచ్చాన్‌’ అని ప్రేమగా పిలుచుకుంటూ తనకంటూ ప్రత్యేక స్దానాన్ని సంపాదించుకుంది.

తమిళంలోని టాప్‌ హీరోలందరితో నటించి హాట్‌ డ్రీమ్‌ గార్ల్‌గానూ మారింది. విజయ్‌తో ‘అళగియ తమిళ్‌ మగన్‌’, అజిత్‌తో ‘బిల్లా’ చిత్రాల్లో గ్లామరస్‌గా నటించి అభిమానులను ఆకట్టుకుంది. కొత్త హీరోయిన్ల్ల రాకతో అమ్మడికి అవకాశాలు తగ్గడం ప్రారంభించాయి. బిగ్‌బాస్‌ షోలో పాల్గొని బుల్లితెర అభిమానులను కూడా ఆకట్టుకుంది. ఇంతలో తన ప్రియుడు వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుని అందరినీ ఆశ్యర్యపరిచింది. మళ్లీ కోలీవుడ్‌లో తన అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అందుకు సంబంధించి తన భారీ సైజ్‌ను ఆరునెలల్లో 15 కిలోలను తగ్గించుకుని జిరో సైజ్‌కు మార్చుకుని కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. తన జిరో సైజ్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.