‘నోటా’ ఆప్షన్ ఉందని గుర్తు చేస్తున్న నాగశౌర్య హీరోయిన్

యామినీ భాస్కర్ గుర్తుందా..కీచక సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి ఆ తర్వాత నాగ శౌర్య నర్తన శాల చిత్రంలో నటించి, తాజాగా ఆమె కొత్తగా మా ప్రయాణం అనే సినిమా చేస్తోంది. అయితే ఇప్పుడు వార్త సినిమాల గురించి కాదు కాబట్టి ఇక్కడితో ఆపేద్దాం. ఆమె ఓటు హక్కు గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేసి వార్తల్లోకి ఎక్కింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో చాలా మంది యూత్ తో పాటు సెలెబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నాయి. అలాంటివారిలో యామినీ భాస్కర్ ఒకరు. ఈ విషయమై ఆమె చాలా ఎక్సైంటింగ్ గా ఉంది.

యామినీ భాస్కర్ స్పందిస్తూ..ఎలక్షన్స్ రోజున సెలవు రోజున భావించి ఎంజాయ్ చేయకుండా నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని కోరారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ నచ్చకపోతే నోటా ఆప్షన్ ఉందని, అందువల్ల దాన్ని వాడుకోవచ్చని అన్నారామె.

ఓటు వేయడం కేవలం బాధ్యత మాత్రమేకాదు మన భవిష్యత్‌ను నిర్ణయించేది అని చెప్పారు. అందువల్ల ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అదేసమయంలో ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేదానిపట్ల ఇంట్రస్టింగ్ గా ఉందని చెప్పుకొచ్చింది.