వివాదాస్పద కన్నడ హీరో దునియా విజయ్పై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసు ఇచ్చినా విచారణకు హాజరుకాకపోవటంపై విజయ్కు మరో నోటీసును జారీ చేసింది. ఈ వారంలోపు తమ ముందు హాజరు కావాలని స్పష్టంచేసింది.
తన భర్త రెండవ పెళ్లి చేసుకుని తనను దూరంగా ఉంచడంతో జీవనం కష్టమైందని మొదటి భార్య నాగరత్న పిల్లలతో కలిసి ఇటీవల కమిషన్కు ఫిర్యాదు చేయటంతో కమిషన్ స్పందించింది. సినిమా షూటింగ్లో బీజీగా ఉన్నందున తను హాజరు కాలేక పోతున్నట్లు, కొంత సమయం కావాలని విజయ్ కోరినట్లు తెలిసింది.
మరో ప్రక్క మొదటిభార్య నాగరత్న నుంచి విడాకులు తీసుకోవాలని దునియా విజయ్ సిద్ధమవుతున్నాడు. నాగరత్న, ఆమె పిల్లలు …దునియా విజయ్, అతని రెండ వభార్య కీర్తి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడం, పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తుండడం తెలిసిందే. రోజూ తన కుటుంబ గొడవలు వీధినపడడం మంచిది కాదు, నాగరత్నతో తెగతెంపులు చేసుకోవాలని భావించిన దునియా విజయ్ బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో విడాకుల అర్జీ పెట్టుకున్నట్లు చెప్తున్నారు.
నెల రోజుల నుండి నాగరత్న, పిల్లలతో గొడవలు జరుగుతుండడంతో విడాకులకు ఇదే సమయం అని విజయ్ అనుకున్నాడు. గత రెండేళ్ల క్రితం ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించి విడాకులకు కోర్టుకెళ్లినా, మళ్లీ రాజీకి వచ్చారు. తాజా గొడవలతో విజయ్ మళ్లీ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు.