మోహన్ బాబుని కెలకుతున్నట్లేగా?అంతేగా

ఇంటా..బయిటా మోహన్ బాబు జోలికి పొరపాటున ఎవరూ వెళ్లటానికి ఇష్టపడరు. ఆయన వాయిస్ తో ఓ వార్నింగ్ ఇస్తే చాలు వణికిపోతూంటారు. అయితే రామ్ గోపాల్ వర్మ స్కూల్ లో ఇలాంటివాటికి ప్లేస్ లేదు. తను అనుకున్నది మంచైనా, చెడైనా చేసేయటమే. అందుకోసం ఎవరితోనయినా పెట్టుకోవటానికి రెడీగా ఉంటారు వర్మ. ఇప్పటికే నందమూరి కుటుంబంతో, తెలుగుదేశం పార్టీతో విరోధం కోరి తెచ్చుకున్న వర్మ…ఇప్పుడు మోహన్ బాబు ని కూడా కెలుకుతున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో అన్నీ నిజాలే చెబుతా అంటున్న వర్మ ఇప్పుడు ఎన్టీఆర్ తో ఎంతో అనుబంధం ఉన్న మోహన్ బాబుని తన లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపించబోతున్నారట. దాంతో ఏ కోణం లో ఎలా చూపించబోతున్నాడో అనే హాట్ టాపిక్ మొదలైంది. ఎన్టీఆర్, మోహన్ బాబుకి మధ్య సన్నివేశాలను రామ్ గోపాల్ వర్మ అద్భుతంగా తెరకెక్కించాడని చెబుతున్నారు. చివర రోజుల్లో మోహన్ బాబుతో మంచి అనుబంధాన్ని మెయింటైన్ చేశారు.

అలాగే ఎన్టీఆర్ ద్వితీయ వివాహం చేసుకున్నప్పుడు కూడా మోహన్ బాబు ఎన్టీఆర్ కి, లక్ష్మి పార్వతికి బాగా సపోర్ట్ చేసారు. అంతేకాక లక్ష్మి పార్వతితోనూ మోహన్ బాబు బాగానే ఉండేవాడు.

కానీ ఎన్టీఆర్ మరణం తర్వాత మోహన్ బాబుకి, లక్ష్మి పార్వతికి గ్యాప్ వచ్చేసింది. అది ఎంతదాకా వెళ్లిందంటే… ఆ ఒకానొక సందర్భంలో లక్ష్మిపార్వతి మోహన్ బాబుని దుర్మార్గుడు అంటూ మీడియా ముందు అనేటంత వరకూ. ఇవన్నీ కూడా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపించబోతున్నాడట. అలాగే లక్ష్మి పార్వతి ఆలా ఎందుకు మోబన్ బాబుని అనాల్సి వచ్చిందో కూడా తెర‌ మీద వర్మ చూపించబోతున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే మంచు ఫ్యామిలితో రామ్ గోపాల్ వర్మకు ఎంతో అనుబంధం ఉంది. ఈ నేఫధ్యంలో వర్మ మోహన్ బాబుతో ఎలా పెట్టుకుంటాడో అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకునే విషయం.