సినిమావాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువే. కోట్లతో నడిచే బిజినెస్ లో ఇలాంటి సెంటిమెంట్స్ ఉండటం కూడ వింతేమి కాదు. రామ్ చరణ్ తాజా చిత్రం వినయ విధేయరామ టీమ్ కూడా ఇలాంటి సెంటిమెంట్స్ నే ఫాలో అవుతోంది.
అటు నటుడు, ఇటు నిర్మాతగా ద్విపాత్రాభినయం చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న రామ్ చరణ్ .. మాస్ డైరక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో వినయ విధేయ రామ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైపోయాయి.
ఇప్పటికే చిత్రానికి సంబంధించి సాంగ్స్ విడుదల చేసిన చిత్ర యూనిట్ ఈ నెల 27న యూసఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇదే ప్లేస్ లో రామ్ చరణ్ గత సినిమాలకి సంబంధించిన ఆడియో ఫంక్షన్స్, విజయోత్సవ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. దాంతో మొదట వైజాగ్ అనుకున్నా తర్వాత వెన్యూని ఇక్కడికి మార్చారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో చిరంజీవి చీఫ్ గెస్ట్ గా పాల్గొంటున్నారు.
కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇషా గుప్తా స్పెషల్ సాంగ్తో దుమ్ము రేపనుంంది. దేవి శ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం అందించారు. స్నేహా, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, అనన్య, ఆర్యన్ రాజేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.