మళ్ళీ మెచ్చుకునే పని చేసిన విజయదేవరకొండ

తన డిఫరెంట్ యూటిట్యూడ్ తో యూత్ కు దగ్గరైన విజయ్ దేవరకొండ …మానవత్వంలోనూ ముందుండి అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నాడు. విజయ్‌ దేవరకొండ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు.

వివరాల్లోకి వెళితే..ఈ మధ్యన ఉత్తరాంధ్రను తిత్లీ తుపాను  వణికించిన సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఆ బాధితులను ఆదుకోవడానికి విజయ్ దేవరకొండ ముందుకు వచ్చారు. తన వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలను విరాళంగా అందించారు. అందుకు సంబంధించిన వివరాలను ఆయన ఫేస్‌బుక్‌ ద్వారా  పంచుకున్నారు.

అంతేకాకుండా ఇలాంటి  కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలబడాలని  ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు. ఇంతకు ముందు కేరళలలో వరదలు వచ్చినప్పుడు  తను ఇచ్చిన పిలుపునకు స్పందించిన విధంగా ఉత్తరాంధ్ర ప్రజలకు తోడుగా నిలబడాలని విజయ్‌ కోరారు.

ఇక కెరీర్ విషయానికి వస్తే… ‘గీత గోవిందం’ చిత్రంతో ఘన విజయం సాధించిన విజయ్ …రీసెంట్ గా ‘నోటా’ సినిమాతో తమిళ ప్రేక్షకులకూ పరిచయమయ్యాడు. త్వరలో తన తాజా చిత్రం ‘టాక్సీవాలా’ రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ వంటి చిత్రాలు తెరకెక్కించిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా కమిటయ్యాడు.