కె. ఎస్ . రామరావును “విజయ్ “ఆదుకుంటాడా ?

“తేజ్ ఐ లవ్ యు”  సినిమా తరువాత కె . ఎస్ .రామారావు తేరుకొని మరొక సినిమా తీయబోతున్నాడు.గత కొంతకాలంగా ఆయన తీసిన  “దమ్ము ” మళ్ళీ మళ్ళీ రాని రోజు “, “తేజ  ఐ  లవ్ యు ” సినిమాలు రామారావు ను ఆర్ధికంగా బాగా దెబ్బ తీశాయి. ఎన్టీఆర్ , బోయపాటితో
నిర్మించిన “దమ్ము “సినిమా  తీవ్ర నిరాశకు  గురి చేసింది. ఈ సినిమాకు తన స్థాయికి మించి ఖర్చు చేసాడని అంటారు. కేవలం బోయపాటి అతి నమ్మకమే సినిమాను దెబ్బ తీసిందట.


చిరంజీవితో రామారావు “అభిలాష “, “రాక్షసుడు “, “మరణ మృదంగం “, “ఛాలెంజ్ ” మొదలైన సూపర్ హిట్ చిత్రాలు నిర్మించాడు. దమ్ము తరువాత చిరంజీవితో చిత్రం తీయాలని చాలా ప్రయత్నం చేశాడు. 150 చిత్రం “ఖైదీ నెంబర్ 150” స్వంతంగా  నిర్మించారు. లాభాలు బాగా వచ్చాయి. 151 వ సినిమా  “సైరా “కూడా తామే స్వంతంగా తీస్తున్నామని చెప్పారు. కనీసం రామ్ చరణ్ తో నైనా తీద్దామని రామారావు ప్రయత్నం చేశాడు. దానికి కూడా చిరంజీవి సుముఖంగా లేడని  రామారావు ఆలస్యంగా గ్రహించాడు.

మెగా కుటుంబంలో యువ కెరటంలా దూసుకొస్తున్న సాయిధరమ తేజ్ ను హీరోగా నిర్ణయించుకున్నాడు. తమిళ దర్శకుడు కరుణాకరన్ అయితే వ్యాపారం బాగా అవుతుందని రామారావు ఆశపడ్డాడు. కానీ పసలేని కథతో నిర్మించిన “తేజ్ ఐ లవ్ యు ” సినిమా లేవలేని దెబ్బ తీసింది.

ఇక ఇప్పడు మళ్ళీ మళ్ళీ  రాని  రోజు చిత్ర  దర్శకుడు క్రాంతి మాధవత,  విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా  నిర్మించడానికి  ప్రయత్నాలు
ప్రారంభించినట్టు తెలుస్తుంది.అర్జున్ రెడ్డి, గీత గోవిందంసినిమాలతో  తారాపధంలో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ అయితే హిట్ కొట్టవచ్చునని  రామారావు  భావించాడు. కానీ “నోటా “తో విజయ్ తన ఇమేజ్ ను గ్రౌండ్ లెవెల్ కు తెచ్చుకున్నాడు. ఇప్పుడు విజయ్ తో సినిమా అంటే కమర్షియల్ గా ప్రమాదమే. అన్నీ రామారావుకు తెలుసు. అయినా ఆయన మొండివాడు. ఇచ్చిన మాట తప్పుడు. విజయ్ కాంబినేషన్ లో నైనా రామారావు విజయం సాధిస్తాడేమో చూడాలి!