మాస్ రాజా కోసం ప్రభాస్ టీమ్

క్రాక్ సినిమాతో మొత్తానికి ఒక పవర్ఫుల్ హిట్ అందుకున్నాడు రబితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ఆ సినిమా కరోనా లాక్ డౌన్ తరువాత భారీ సక్సెస్ ను అందుకున్న మొదటి సినిమాగా క్రేజ్ అందుకుంటోంది. దాదాపు ఈ సంక్రాంతి విన్నర్ రవితేజ అని తేలిపోయింది. మరికొన్ని రోజుల్లో సినిమాకి సంబంధించిన థియేటర్స్ సంఖ్య కూడా పెరగనుంది. చూస్తుంటే మాస్ రాజా కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకునేలా ఉన్నాడని అనిపిస్తోంది.


ఇక రవితేజ క్రాక్ కంటే ముందు కొన్ని కమిట్మెంట్స్ ప్రశ్నార్థకంగా ఉండగా ఇప్పుడు వాటికి సమాధానం దొరికేసింది. రవితేజతో కరెక్ట్ సినిమా చేయగలిగితే తప్పకుండా హిట్ కొట్టవచ్చని నిర్మాతలకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ప్రభాస్ స్నేహితులైన యూవీ క్రియేషన్స్ వారి త్వరలోనే మాస్ రాజాతో ఒక సినిమాను సెట్స్ పైకి తెనున్నట్లు తెలుస్తోంది. క్రాక్ సినిమా కంటే ముందే వాళ్ళు మారుతి, రవితేజ కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలని అనుకున్నారు.

అయితే మారుతి, గోపిచంద్ కాంబో సెట్టవ్వడంతో రవితేజ కోసం మరొక దర్శకుడిని వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ ఖిలాడి సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ యాక్షన్ డ్రామా అనంతరం యూవీ క్రియేషన్స్ లో మరో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్. మరి రవితేజ కోసం వారు ఏ దర్శకుడిని ఫైనల్ చేస్తారో చూడాలి.