క్షమించండి, అందులో నిజం లేదు: ఉపాసన

మెగా హీరో రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన తనకు వరుసకు బాబాయ్‌ అయ్యే చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిపై పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని గత రెండు రోజులుగా మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి. టీఆర్‌ఎస్‌ తరఫున ఆమె పోటీ చేయబోతున్నట్లు రాశారు.

విశ్వేశ్వర్‌ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. చేవెళ్ల నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేసి ఎన్నిక‌య్యారు. తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయనపై విజయం సాధించాలంటే ధీటైన అభ్యర్థిని నిలబెట్టాలని, అందుకు ఉపాసన సరైన ఛాయిస్ అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ భావిస్తున్నట్లు ఓ ఆంగ్లపత్రిక రాసుకొచ్చింది.

ఆ రాతల్లో ఏ మాత్రం నిజంలేదని ఉపాసన సోషల్‌మీడియా వేదికగా తేల్చి చెప్పారు. ‘క్షమించండి ఇందులో నిజం లేదు.. ప్రస్తుతం నేను నా జాబ్‌ను ప్రేమిస్తున్నా. సంగీతా రెడ్డి నా బాస్‌ (విశ్వేశ్వర్‌ రెడ్డి భార్య). చిన్నాన్న చేవెళ్లకు చేస్తున్న సేవ సాటిలేనిది’ అని ఆమె పోస్ట్‌ చేశారు.