చిరంజీవిని ఇరుకున పెట్టే ప్రశ్న అడిగిన ఉపాసన

చిరంజీవిని ఇరుకున పెట్టే ప్రశ్న అడిగిన ఉపాసన

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. ఈ చిత్రం ప్రమోషన్ లో బాగంగా ..అపోలో లైఫ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న చిరంజీవి కోడలు ఉపాసన రన్ చేస్తున్న బి పాజిటివ్ అనే హెల్త్ మేగజైన్లో చిు ఈ నెల కవర్ పేజీపై కనిపిచ్చారు. అంతేకాదు ఈ ఇష్యూలో మెగాస్టార్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్ సీక్రెట్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా మామగారైన మెగాస్టార్ నుంచి సైరా మూవీకి సంబంధించిన విషయాలు కూడా రాబట్టే ప్రయత్నం చేసింది ఉపాసన. అందులో భాగంగా ఆమె అడిగిన ప్రశ్న చిరు ని ఇరుకున పెట్టేదే కానీ ఆయన సమయస్పూర్తితో సమాధానమిచ్చారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే..

‘సైరా’ మూవీ యూత్ ఎందుకు చూడాలి? అని ప్రశ్నించిన ఉపాసన ఇంటర్వ్యూలో భాగంగా అడిగింది. ‘ఈ ప్రశ్నకి చిరు సమాధానమిస్తూ.. … ‘ఇది ఈ తరం యూత్ చూడాల్సిన ముఖ్యమైన సినిమా, మన కోసం మన పూర్వీకులు చేసిన త్యాగాలను గురించి చెప్పే సినిమా’ అని తెలిపారు. వారి త్యాగాల ప్రతి ఫలం మనం అనుభవిస్తున్నాం ‘‘దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. వారి త్యాగాల ప్రతి ఫలమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ, వారికి నివాళులు అర్పిస్తూ ఈ చిత్రం ఉంటుంది.” అని మెగాస్టార్ వెల్లడించారు.

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా రిలీజ్ కు దగ్గరకు వచ్చేసింది. అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదల చేస్తామని గతంలో చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. భారీ గ్రాఫిక్స్‌, చిరు గెటప్‌, సెట్స్‌ ఇలా అన్ని సినిమాలోని భారీతనాన్ని చూపించేలా రూపొందించారని ఇప్పటికే రిలీజైన ప్రమోషన్ మెటీరియల్ ద్వారా అర్దమైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు.