‘ఎంజీఆర్’ గా అర‌వింద్ స్వామి లుక్ రిలీజ్ !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత  జీవిత‌కథ‌ ఆధారంగా త‌లైవి చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ న‌టి కంగ‌నార‌నౌత్ లీడ్ పోషిస్తోంది. జ‌య‌ల‌లిత‌ సినీ, రాజకీయ జీవితంలో కీల‌క పాత్ర పోషించిన ఎంజీఆర్‌ (ఎం.జి.రామచంద్రన్) పాత్ర‌లో ప్ర‌ముఖ యాక్ట‌ర్ అర‌వింద్ స్వామి న‌టిస్తున్నాడు.

Team Thalaivi releases a New Look of Arvind Swami

ఆ ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాలో ఆయన ఎంజీఆర్ పాత్రలో ప్రజలకు నమస్తే చెబుతున్నట్లు ఈ లుక్ ఉంది. మరో లుక్ లో ఆయన పిల్లలతో కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఎంజీఆర్ గా అరవింద్ స్వామి లుక్ ఆక‌ట్టుకుంటోంది.

ఈ మూవీలో కరుణానిధి పాత్రలో ప్రకాష్‌రాజ్‌ నటిస్తున్నారు. ఎ.ఎల్‌.విజయ్ డైరెక్ష‌న్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ నిర్మిస్తున్నారు. ‘మక్కల్‌ తిలగమ్‌’ (ప్రజా నాయకుడు)గా తమిళ ప్రజల పిలుచుకునే ఎం.జి.ఆర్‌ మరణానంతరం ఆయన రాజకీయ వారసురాలిగా ఏఐఏడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత ఆరుసార్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు.