ఈ మధ్య సినీ సెలబ్రిటీల పరిస్థితి ఏం బాగోలేదు. ఇటీవలే కోబ్రా పోస్ట్ నోట్ టు వోట్ అనే స్ట్రింగ్ ఆపరేషన్లో 36 మంది సినీ సెలబ్రిటీలు అడ్డంగా దొరికిపోయారు. వివేక్ ఒబెరాయ్, సోనూసూద్, జాకీష్రాఫ్, కైలాష్ ఖేర్, సన్నీలియోన్, శక్తికపూర్, శ్రేయస్ తల్పడే, అమీషా పటేల్, పంకజ్ ధీర్, నికితన్ ధీర్, పునీత్ ఇస్సార్, టిస్కా చోప్రా, రాఖీ సావంత్, రాజ్పాల్ యాదవ్ మిన్నిసా లాంబ, మహిమా చౌదరి, రోహిత్ రాయ్, అమన్ వర్మ, కోయినా మిత్ర, దలేర్ మెహందీ, మికా, రాహుల్ భట్, రాజు శ్రీవాస్తవ, విజయ్ ఈశ్వర్లాల్ తదితరులు కెమెరా కంటికి చిక్కారు.
ఈ వ్యవహారం సద్దు మణగక ముందే.. ఇప్పుడు మరో స్కామ్లో మరికొంత మంది బడా స్టార్స్ చిక్కారు. అసలు విషయమేమంటే.. ప్రభుత్వం వారు నిషేధించిన మల్టీ లెవల్ మార్కెటింగ్ సిస్టమ్ .. అంతర్గతంగా కొనసాగుతూనే ఉంది. రీసెంట్గా హైదరాబాద్ పోలీసులు చేపట్టిన క్యూ నెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్ వ్యవస్థపై పోలీసులు కేసు ఫైల్ చేసి కూపీ లాగితే వారికి దిమ్మ తిరిగే నిజాలు తెలిశాయి.
ఈ మార్కెటింగ్ సిస్టమ్లో ప్రముఖ బాలీవుడ్ తారలు షారూక్ఖాన్, బోమన్ ఇరానితో పాటు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్నకొడుకు, హీరో అల్లు శిరీష్తో పాటు ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తున్న హీరోయిన్ పూజా హెగ్డే పేర్లు బయటకు వచ్చాయి. వీరితో పాటు మరికొందరు సెలబ్రిటీల పేర్లు తెలుసుకున్న పోలీసులు అందరికీ నోటీసులు పంపారు. మరి ఈ వ్యవహారంపై ఈ యాక్టర్స్ ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారో చూడాలి.
-మోహన్
