తమన్నాతెగ సంబరపడి పోతోంది!

తమన్నాతెగ సంబరపడి పోతోంది!

 
మిల్కీ బ్యూటీ తమన్నా తెగ సంబరపడి పోతోంది. నటిగా తనపై నమ్మకంతోనే దర్శకులు వైవిధ్యమైన పాత్రలు సృష్టిస్తున్నారంటోంది. తన కెరీర్‌లో ఇంతవరకూ చేయనటువంటి పాత్రను ‘సైరా’లో చేస్తున్నానంటూనే …  ఆ సినిమాతో తనకు డబుల్ బొనాంజా దక్కినట్టేనన్న ఆనందం వ్యక్తం చేస్తోంది.
 
చిరంజీవితో కలిసి నటించే అవకాశం రావడం ఒకటైతే, తాను అభిమానించే నయనతారతో కలిసి పనిచేయాల్సి రావడం మరొకటట. స్టార్ హీరోల సరసన చాన్స్‌లు లేకున్నా, తెలుగు, తమిళం, హిందీ.. ఇలా లెక్క తక్కువకాకుండా తమన్నా సినిమాలు చేస్తూనేవుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే విడుదలైన నాలుగు చిత్రాలు గొప్ప విజయాలు అందుకోకున్నా తమన్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు.
 
ప్రస్తుతం తెలుగులో సైరా, దటీజ్ మహాలక్ష్మి చేస్తోంది మిల్కీ బేబీ. బాలీవుడ్‌లో చాన్స్ రావడంతో -టాలీవుడ్‌లో రాజుగారి గది 3ని వదిలేసుకోవడం తెలిసిందే. నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి ‘బోలే చుడియాన్’ చేస్తున్న తమన్నా, ఈ సినిమాలో తన పాత్ర కెరీర్‌కు ఎంతో ఉపయుక్తమన్న భావనతో ఉంది. అటు తమిళంలో విశాల్‌తోనూ ఓ సినిమా చేస్తోంది. పల్లెటూరి యువతిగా మాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తూ .. యాక్షన్ సీన్స్ చేయనుందట. ఇదంతా తన అదృష్టమని చెప్పుకొస్తుంది.