‘శుభలేఖ+లు’ సినిమా హక్కుల్ని సొంతం చేసుకున్ననిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి

ఇటీవల కాలంలో  ఓ ప్రత్యేకమైన అటెన్షను రప్పించుకున్న చిత్రం ‘శుభలేఖ+లు’. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా  విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్ లోను, ఇటుమార్కెట్ లోను ఓ క్యూరియాసిటీ సొంతం చేసుకున్నదీ  చిత్రం. ఇందులో నటించిన తారలు, దర్శకుడు, నిర్మాతలు అందరూ కొత్తవారు కావటం విశేషం. బోయపాటి శ్రీను, వంశీ  పైడిపల్లి శిష్యుడైన  శరత్ నర్వాడే ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హనుమా  తెలుగు మూవీస్ పతా కంపై సి.విద్యాసాగర్,జనార్దన్ ఆర్.ఆర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులోశ్రీనివాస్ సాయి, దీక్ష శర్మరైనా హీరో హీరోయిన్లు  . ప్రియా వడ్లమాని లీడ్ క్యారెక్టర్ చేసారు. వంశీ నెక్కంటి ,మోనా  బే ద్రే ముఖ్య పాత్రదారులు. శ్రీమతి. సుధారాణి ఈ చిత్రానికి సమర్పకురాలు . ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని పుష్యమి ఫిలిం మేకర్స్ అధినేత  బెల్లం  రామకృష్ణా రెడ్డి చూసి చాలా  ఇంప్రెస్ అయ్యి ,  ఫ్యాన్సీ ఆఫర్ తో  ఈ సినిమా హక్కులను సొంతంచేసుకున్నారు. ఈ సందర్భంగా  బెల్లం  రామకృష్ణా రెడ్డి   మాట్లాడుతూ ” ఈ సినిమా హక్కులని సొంతం చేసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫీల్ గుడ్  సినిమా రాలేదు . చాలా  గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది . అటుయూత్, ఇటు ఫ్యామిలిస్ అందరికీ ఈ మూవీ నచ్చుతుందనే నమ్మకo  ఉంది ” అని చెప్పారు.

 నిర్మాతలు సి.విద్యాసాగర్,జనార్దన్ ఆర్.ఆర్  మాట్లాడుతూ ” సినిమాలో కొత్తదనం ఉంటే చిన్న, పెద్ద అని తేడా లేకుండా  ప్రేక్షకులు  బ్రహ్మ రథం పడుతున్నారు.  కంచరపాలెం,RX100 సినిమాలు ఏ రేంజ్ హిట్అయ్యాయో  అందరికి తెలిసిందే. మా సినిమా కూడా ఆ జాబితాలో చేరుతుంది.బెల్లం  రామకృష్ణా రెడ్డి  లాంటి అభిరుచి ఉన్న వ్యక్తి  ఈ సినిమా హక్కులు తీసుకోవటం మాకు ఆనందం కలిగిస్తోంది. అతి త్వరలోనే విడుదల  తేదీని ప్రకటిస్తాం” అని తెలిపారు.

 

ఈ చిత్రానికి  సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్, కథ – మాటలు: జనార్దన్ ఆర్.ఆర్. – విస్సు, కథా సహకారం: సి.విద్యాసాగర్.

పాటలు: పెద్దాడ మూర్తి, పులగం చిన్నారాయణ , జనార్దన్ ఆర్.ఆర్