శ్రీను వైట్ల అన్న మాట మీద నిలబడతాడా?

ఉత్సాహంలో ఆవేశంగా ఇచ్చే స్టేట్మెంట్స్ ఆ తర్వాత తలకు చుట్టుకుంటాయి. పరిస్దితి తిరగబడగానే పగ పట్టిన పాముల్లా వెంటాడతాయి. ఇప్పుడు శ్రీను వైట్ల పరిస్దితి అదే. ఆయన తాజా చిత్రం‘అమర్ అక్బర్ ఆంటోని’ డిజాస్టర్ అయ్యింది. అయితే ఇది తొలి ప్లాఫ్ అయితే జనం పట్టించుకోకపోదురు. మహేష్ తో చేసిన ‘ఆగడు’ తర్వాత ‘బ్రూస్ లీ’, ‘మిస్టర్’ ఇప్పుడేమో ‘అమర్ అక్బర్ ఆంటోని’. తన రొటీన్ కథలు, ట్రాక్ లతో శ్రీను వైట్ల ఇలా ప్లాఫ్ ల బాటపట్టాడు. ఒకదాన్ని మించి మరొక డిజాస్టర్ ఇస్తూ వచ్చాడు శ్రీను వైట్ల.

అయితే ఇంత ఫ్లాఫ్ ల్లో ఉన్నా ఆయన స్టేట్మ్ంట్స్ లో ఎక్కడా వెనకాడలేదు. తనతో సినిమా చేయటానికి ఐదుగురు నిర్మాతలు లైన్ కడితే..మైత్రీ వాళ్లతో ముందుకు వెళ్ళానని అన్నాడు. అలాగే తాను ఎలాంటి స్థితిలో కూడా ఏ హీరోనూ.. నిర్మాతనూ సినిమా చేయమని అడగనని కూడా వైట్ల ఈ చిత్రం ప్రమోషన్స్ భాగంగా మీడియాతో మాట్లాడుతూ అన్నాడు. ఆ మాటలే ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి.

శ్రీను వైట్ల ఇంత జరిగాక ..ఇప్పుడు ఏ హీరో దగ్గరకూ వెళ్లరా..ఏ నిర్మాతను కలిసి కథ చెప్పరా..వాళ్లే తన దగ్గరకు వస్తారని వెయిట్ చేస్తారా అని సినిమా జనం మాట్లాడుకుంటున్నారు. పెద్ద పెద్ద నిర్మాతలు సైతం ఈ విషయమై డిస్కస్ చేస్తున్నారంటే మ్యాటర్ ఎంతలా లోపలకి వెళ్లిందో అర్దం చేసుకోవచ్చు. ఇన్ని డిజాస్టర్స్ ఇచ్చాక..పని గట్టుకుని శ్రీను వైట్లని కలిసి సినిమా చెయ్యమని అడిగే హీరో ఎవరు ఉంటారు..ధైర్యం చేసే నిర్మాత ఎవరు ఉంటారని జోక్స్ వేసుకుంటున్నారు. మరి శ్రీను వైట్ల వీళ్లకు కౌంటర్ ఇచ్చేలా తిరిగి హిట్ తో వస్తాడా ..చూడాలి.