టాలీవుడ్ హంక్ రానా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. తను ప్రేమించిన మిహీకా బజాజ్ పెళ్లి చేసుకుని బ్యాచిలర్ జీవితానికి పుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. ఇటీవలే ఈ అమ్మాయే నా ప్రేయసి అంటూ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను రానా అభిమానులతో పంచుకున్నాడు. టాలీవుడ్ సెలబ్రిటీలంతా ఆ ఫెయిర్ ని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్లు పెట్టారు. అయితే పెళ్లి వచ్చే ఏడాది ఉంటుందా? అని పలువురు ప్రశ్నించగా డాడ్ సురేష్ బాబు లైన్ లోకి వచ్చి రానా పెళ్లి ఈ ఏడాదిలోనే ఉంటుందని రివీల్ చేసారు.
ఇక రానా ఈ ఏడాది తో బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పేసినట్లే. ఇప్పుడంతా దగ్గుబాటి ఫ్యామిలీ ఎంతో సంతోషంగా గుడుపుతోంది. లాక్ డౌన్ టైమ్ ఫ్యామిలీ అంతా ఒకే చోట కలుసుకుని ఖాళీ సమాయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రానా పెళ్లి వార్తతో ఆ సంతోషం రెట్టింపు అయింది. ఈ నేపథ్యంలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి రానా గురించి తనకేదో తెలుసునంటూ ఓ కామెంట్ విసిరింది. నీలైఫ్ లో ఏం జరిగిందో నాకు తెలుసు రానా గారు. ఈ అమ్మాయితో ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించలని కోరుతూ ఓ పోస్ట్ పెట్టింది. మరి రానా జీవితంలో ఏం జరిగిందో? రానాకి తెలియాలి లేదా శ్రీరెడ్డికి తెలియాలి.
కానీ ఏం జరిగిందో మాత్రం శ్రీరెడ్డి చెప్పకుండా మీడియా అటెన్షన్ ని డ్రా చేసింది. అన్నట్లు శ్రీరెడ్డి గతంలో రానా తమ్ముడు అభిరామ్ తో ఎఫైర్ నెరిపిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలు..ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వాటిపై సురేష్ బాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఆ తర్వాతే శ్రీరెడ్డి ఎవరో? అందరికీ తెలిసింది. ఇక రానా-నటి త్రిషతో కొన్నాళ్లు ప్రమాయణం నడిపినట్లు అప్పట్లో మీడియా కథనాలు వేడెక్కించిన సంగతి తెలిసిందే.