చెర్రీ తో అనుకుంటే..దేవరకొండకు సెట్ అయ్యింది

                             (సూర్యం)

అర్దాంతరంగా తనువు చాలించి అందరినీ విడిచిపెట్టి వెళ్లిపోయిన శ్రీదేవి కు ఇప్పటికి తెలుగునాట ఫ్యాన్స్ ఎక్కువే. దాంతో ఆమె కుమార్తె జాన్విని సైతం తెలుగులో లాంచ్ చేస్తే బాగుంటుందని టాక్స్ చాలా సార్లు జరిగాయి. అప్పట్లో రామ్ చరణ్ సరసన జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ..చేస్తారని వీళ్లద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

ఓ సారి శ్రీదేవి..అవును..మా అమ్మాయి లాంచింగ్ కోసం తెలుగులో చాలా మంది అడిగారు అని కూడా చెప్పింది. అయితే తెలుగులో తన కుమార్తె తెరంగ్రేటం చూడకుండానే ఆమె వెళ్లిపోయింది. ఇప్పుడు జాన్వి తెలుగులో చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. త్వరలో జాన్వి.. వరస హిట్స్ తో దూసుకుపోతున్న యంగ్ హీరో  విజయ్‌ దేవరకొండకు జోడీగా నటించబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.  ఈ విషయం గురించి జాన్వి
నుంచి అఫీషియల్ గా  ప్రకటన రావాల్సి ఉంది.

మరాఠీలో బ్లాక్‌ బస్టర్‌   ‘సైరాట్‌’  రీమేక్‌గా వచ్చిన ‘ధడక్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది జాన్వి. . విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.100
కోట్ల క్లబ్‌లో చేరింది. అలా జాన్వి మొదటి సినిమాతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.  ప్రస్తుతం జాన్వి  ‘తఖ్త్‌’ అనే చారిత్రక చిత్రం సైన్ చేసింది.  ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మించనున్నారు. కరీనా కపూర్‌, విక్కీ కౌశల్‌, ఆలియా భట్‌, రణ్‌వీర్‌ సింగ్‌, భూమి పెడ్నేకర్‌
కీ రోల్స్ లో కనిపించనున్నారు.