ప్రముఖ గాయకుడు ఎస్.పి బాల సుబ్రహ్మణ్యం తల్లి కన్నుమూత

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తల్లి శకుంతలమ్మ సోమవారం ఉదయం కన్నుమూసింది. గతకొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె వయస్సు 89 సంవత్సరాలు. నెల్లూరులోని తిప్పరాజువారి వీధిలో ఉన్న స్వగృహంలో ఆమె కన్నుమూశారు.

ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం లండన్ లో ఉన్నారు. కచేరీ కార్యక్రమాల నిమిత్తం ఆయన లండన్ వెళ్లారు. తల్లి మరణించారన్న వార్త తెలియగానే ఆయన హూటాహుటిన ఇండియాకు తిరుగు ప్రయాణమయ్యారు. సోమవారం సాయంత్రం వరకు ఆయన నెల్లూరు చేరుకుంటారు. మంగళవారం ఉదయం నెల్లూరులో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.