మోసం చేసాడ‌ని శ్యాంకె. నాయుడిపై న‌టి ఫిర్యాదు

టాలీవుడ్ ఇండ‌స్ర్టీలో ఎఫైర్లు చాలా రేర్. ఒక‌వేళ్ల ఉన్నా అంత ఈజీగా బ‌య‌ట‌కు రావు.  `మీటూ` లాంటి ఉద్య‌మాలు తారాస్థాయికి చేరిప్పుడే బాధితులు ఒక్కొక్క‌రు బ‌య‌ట‌కు వ‌స్తుంటారు. అయితే ప్ర‌తీ వివాదానికి ఓ కార‌ణం ఉంటుంది.  అప్పుడ‌ప్పుడు అలాంటి కార‌ణాలు సెల‌బ్రిటీల‌ను బ‌య‌ట‌కు లాగుతుంటాయి. తాజాగా సినిమాటోగ్రాఫర్  శ్యామ్ .కె. నాయుడు   చిక్కుల్లో ప‌డ్డారు. ఆయ‌న‌పై `అర్జున్ రెడ్`డి ఫేం సాయి సుధ త‌న‌ని మోసం చేసాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. త‌న‌ని పెళ్లి చేసుకుంటాని శారీర‌క సుఖంతో పాటు డ‌బ్బులు దోచుకున్నాడ‌ని పోలీస్ స్టేష‌న్ లో కంప్లైట్ ఇచ్చింది. వివ‌రాల్లోకి వెళ్తే…

2012లో ప‌రిచ‌య‌మైన శ్యామ్ కె. నాయుడికి సుధ 2015లో శారీర‌కంగా దగ్గ‌రైందిట‌. త‌న‌ని పెళ్లి చేసుకుంటాన‌ని, చెప్పి ప్ర‌స్తుతం ఉన్న భార్య‌కు విడాకులిచ్చిన త‌ర్వాత ఆతంతు పూర్తి చేద్దామ‌ని చెప్పారుట‌. అలా కొన్నాళ్ల పాటు ఇద్ద‌రి వ్య‌వ‌హారం న‌డించింద‌ని సాయిసుధ ఓ మీడియా ఇంట‌ర్వూలో వెల్ల‌డించింది. అయితే కాల క్రమేణా ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ‌లు త‌లెత్తాయ‌ని ఆమె వ్యాఖ్య‌ల‌ను బట్టి తెలుస్తోంది. భార్య‌కు విడాకులు ఇవ్వ‌కుండా త‌న‌తో సంసారం చేయ‌డంపై త‌రుచూ ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జరిగేవని …తాగొచ్చి కొట్టేవాడ‌ని ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ విష‌యంలో శ్యామ్ కె అన్న‌య్య ఛోటాకె. నాయుడు ప‌లుమార్లు ఇన్వాల్వ్ అయ్యార‌ని తెలిపింది.

అలా ఛోటా కె మాట విని బ‌య‌ట‌ప‌డ‌లేద‌ని అంది. ఇంకా సందీప్  కిష‌న్ కుటుంబ స‌భ్యులు కూడా ఈ వ్యవ‌హారంలో నెమ్మ‌దిగా ఉండ‌మ‌ని ప‌లుమార్లు చెప్పిన‌ట్లు తెలిపింది. కానీ  రోజు రోజుకి శ్యామ్ . కె ఆగ‌డాలు ఎక్కువైపోతున్నాయ‌ని..దానికి తోడు అత‌ను చేసిన మోసాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయ‌ని ఆరోపించింది. అయితే శ్యామ్ . కె నాయుడుతో విడిపోవ‌డానికి డిసైడ్ అయ్యార‌ని చివ‌రిగా ప్ర‌శ్నిస్తే అలా లేద‌ని…త‌న‌తో గ‌తంలో ఎలా ఉన్నాడో? ఇప్పుడు అలాగే ఉండాల‌ని…శ్యామ్ కె. నాయుడుతో జీవితాంతం క‌లిసి బ్ర‌త‌కాల‌నుకుంటున్న‌ట్లు  తెలిపింది. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం పోలీస్ స్టేష‌న్ లో ఉంది. ఇరువురు మ‌ధ్య పోలీసులు రాజీ కుదిర్చే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.