కరుణానిధి మరణం..ఇది ఫన్ టైం! శృతి హాసన్ రాంగ్ ట్విట్

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు వేసే ప్రతి అడుగు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఒక ట్విట్ చేసేటప్పుడు పరి పరి విధాలా ఆలోచించాల్సిందే.లేకుంటే శృతి హాసన్ కు ఎదురైనట్లే చేదు అనుభవం తప్పదు.

నిన్న రాత్రి నుంచి ట్విట్టర్ లో ఇండియన్స్ అందరికి ఒకటే టాపిక్ అది…కరుణానిధి మరణం. కేవలం దక్షిణాది వాళ్లే కాదు ..ఉత్తరాది జనాలు కూడా కరుణానిధి మరణం గురించి మాట్లాడుకుంటున్నారు.ఆయనకు సంతాపాలు ప్రకటిస్తున్నారు.ఇక తమిళ జనాల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. అందరూ విషాదంలో మునిగిపోయారు. కరుణణకు నివాళి అర్పిస్తున్నారు.

ఇలాంటి టైంలో శృతి హాసన్ ఒక రాంగ్ ట్విట్ చేసి నెటిజన్లకు దొరికిపోయారు.కరుణ మరణానికి సంతాపం ప్రకటించకపోగా ఆమె తాను లండన్ లో చేస్తున్న మ్యూజిక్ ఆల్బం గురించి ప్రస్తావించింది. ఇది ఫన్ టైం అంటూ ట్విట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై విరుచుకపడుతున్నారు. శ్రుతికి కరుణ గురించి తెలియకుండా ఉంటుందని ఎవరు భావించడం లేదు.

ఆమె తండ్రి కమల్ హాసన్ ఇప్పుడు రాజకీయ నేత. ఒక పార్టీని కూడా నడిపిస్తున్నారు. కరుణ మరణం పై ఆయన కూడా ఉద్వేగంగా స్పందించారు. అలాంటిది శృతి మాత్రం పట్టనట్లు తన ఆల్బం గురించి ప్రస్తావించే సరికి జనాలకు మండిపోయింది.

సంతాపం ప్రకటించకపోగా ఈ ట్విట్లేంటంటూ ఆమెను తిట్టిపోశారు.కనీస ఇంకిత జ్ఞానం లేదా అంటూ విమర్శించారు. అయితే శృతికి విషయం తీవ్రత అర్థమైందో లేదో కానీ ..ఆమె మాత్రం తన ట్విట్ ను డిలీట్ చేయలేదు .