శిల్పాశెట్టి రీ ఎంట్రీ !

కాలు జారితే అంతేగా.. చీవాట్లు తిన్న నాటీ యోగా క్వీన్!

నా సుదీర్ఘ విరామానికి ముగింపు పలుకుతున్నా త్వరలోనే నికమ్మలో నన్ను చూడబోతున్నారు. అభిమన్యు, షిర్లేసేతియా వంటి అద్భుతమైన, ప్రతిభావంతులైన నటులతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదాలు కావాలి. ఇన్నేళ్లుగా నాపై ప్రేమ కురిపిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు’ అంటూ బాలీవుడ్‌ భామ శిల్పాశెట్టి తన రీ ఎంట్రీని ఖరారు చేశారు. 90 వ దశకం నుంచి బాలీవుడ్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ పొడుగుకాళ్ల సుందరి వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. వీరికి వియాన్‌ అనే కుమారుడు కూడా ఉన్నాడు.

కాగా గత పదమూడేళ్లుగా వెండితెరకు దూరమైనప్పటికీ.. తన యోగాసనాలతో శిల్పాశెట్టి ప్రేక్షకులకు చేరువగానే ఉన్నారు. యోగా వీడియోలు, తన కుమారుడికి సంబంధించిన విషయాల గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో తను త్వరలోనే ఓ సరికొత్త సినిమాతో ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ సినిమాకు షబ్బీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు