ఆర్ధిక ఇబ్బందుల్లో రాశీ..ప‌ట్టించుకోని క‌ల‌ర్స్ అధినేత‌!

ఒక‌ప్ప‌టి హాట్ హీరోయిన్ రాశీ కొన్నాళ్ల పాటు టాలీవుడ్ ని ఏలింది. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అయితే పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది. పిల్లలు..భ‌ర్త అంటూ ఫ్యామిలీ లైఫ్ తో బిజీ అయిపోయింది. ఆ మ‌ధ్య లంక అనే సినిమాతో మ‌రోసారి రీ ఎంట్రీ ఇచ్చిందికానీ…నిల‌దొక్కుకోలేక‌పోయింది. అక్క‌..అమ్మ..ఒదిన పాత్ర‌ల‌కు సైతం సై అంటూ ముందుకొచ్చింది గానీ! అవ‌కాశాలైతే అందుకోలేక‌పోయింది. ఈ క్ర‌మంలో రాశీ ఆర్ధికంగా బాగా ఇబ్బందుల్లో ఉంద‌ని కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. త‌న సోద‌రుడు, క‌ల‌ర్స్ బ్యూటీ పార్ల‌ర్ అధినేత విజ‌య్ కృష్ణ కూడా రాశీని ప‌ట్టింకోలేద‌ని బ‌ల‌మైన ప్ర‌చారం సాగుతోంది.

రాశీ అప్పులు పాలైన విష‌యం విజ‌య్ కృష్ణ‌కు తెలిసినా ఆమెను లైట్ తీసుకున్నాడ‌ని, డ‌బ్బే ప్ర‌ధానంగా జీవిస్తున్నాడు అన్న ఆరోప‌ణ‌లు వెల్లు వెత్తాయి. అందుకు రాశీ వ్య‌వ‌హార శైలే కార‌ణం అని ప‌రిశ్ర‌మ‌లో జోరుగా వినిపిస్తోంది. రాశీ కి వ్య‌క్తిగ‌త ఖ‌ర్చులు..విందులు, విలాసాలు ఎక్కువ‌ని… లైఫ్ స్టైల్ మార్చుకోమ‌ని సోద‌రుడు ఎంత చెప్పినా విన‌క‌పోవ‌డంతో విజ‌య్ కృష్ణ ప‌ట్టించుకోలేద‌ని ప్ర‌చారంలోకి వ‌చ్చింది. వీట‌న్నింటికి మించి ఆమెలో సాప్ట్ కార్న్ కూడా ఆర్ధిక ఇబ్బందుల‌కు దారి తీసింద‌ని అంటున్నారు. ఎవ‌రైనా స‌హాయం అంటూ ఆమె ఇంటి గుమ్మం తొక్కితే వెన‌కా ముందు ఆలోచించ‌కుండా స‌హాయం చేయ‌డం లో చొర‌వ తీసుకుంటుంద‌ని, ఆకార‌ణంగానే ఆర్ధిక ఇబ్బందుల్లో ప‌డిన‌ట్లు ప్రచారం సాగుతోంది.

అయితే తాజాగా వాట‌న్నింటిపై రాశీ స్పందించింది. త‌ను ఎలాంటి ఆర్ధిక ఇబ్బందుల్లో లేన‌ని, కుటుంబంతో సంతోషంగా ఉన్నాన‌ని, సోద‌రుడుతో కూడా ఎలాంటి విబేధాలు లేవ‌ని వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ఆ మ‌ధ్య క‌ల‌ర్స్ పై ఐటీ దాడులు జ‌రిగాయి. ఆదాయం విష‌యంలో త‌ప్పుడు లెక్క‌లు చూపించ‌డంతో దాడులు చేసామ‌ని అధికారులు తెలిపారు. ఇంత‌లోనే రాశీ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందంటూ క‌థ‌నాలు రావ‌డం వెనుక అంత‌రార్ధం ఏంటో అర్ధం కానీ స‌న్నివేశం ఎదుర‌వుతోంది.