‘ఎన్టీఆర్’ లో …లక్ష్మీ పార్వతిగా సీనియర్ హీరోయిన్ ? బాలయ్య స్ట్రిక్ట్ గా ఆదేశం

                                                            (సూర్యం)

బాలయ్య, క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ శరవేగంగా సంక్రాంతి కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.  ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి పోటీగా రామ్ గోపాల్ వర్మ …లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మొదలెట్టారు. అందులో లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రాధాన్యత కలిగి ఉండనున్నాయి. అయితే అదే సమయంలో ఎన్టీఆర్ బయోపిక్ లో లక్ష్మీ పార్వతి ఉంటుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.

లక్ష్మీ పార్వతి లేకపోతే …ఆయన బయోపిక్ కు అన్యాయం చేసినట్లే అని, ఆమెని మంచిగా  చూపెడతారా…చెడుగా చూపెడతారా అనేది ప్రక్కన పెడితే ఆమె మాత్రం బయోపిక్ లో ఉంటేనే ఆయన జీవిత చరిత్ర చరమాంకానికి నిండుతనం వస్తుందనేది నిజం.

 ఈ నేపధ్యంలో లక్ష్మీ పార్వతి పాత్రను క్రిష్ డిజైన్ చేసారని, ఆమె ఎన్టీఆర్ ని కలవటం, తన కవిత్వంతో ఆయన్ని ఇంప్రెస్ చేయటం వంటి కొన్ని సన్నివేశాలు కథాంశంలో చోటు చేసుకున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఇప్పుడు లక్ష్మీ పార్వతిగా ఎవరు చేయనున్నారనేది మరో పెద్ద ప్రశ్న.

అయితే ఆ ప్రశ్నకు సమాధానం క్రిష్ …సీనియర్ నటి ఆమనిని ఎంచుకుని ఇచ్చారని చెప్తున్నారు. ఆమని తన నటనతో క్లైమాక్స్ ముందు వచ్చే ఆ సన్నివేశాలను పండించగలదని, అయితే ఆమెది గెస్ట్ రోల్ లాంటి పాత్రేనని చెప్తున్నారు. కాంట్రవర్శి సన్నివేశాలు ఏమీ లేకుండా డిజైన్ చేస్తున్నారు. రిలీజ్ తర్వాత కూడా లక్ష్మి పార్వతి నుంచి ఎటువంటి సమస్య ఎదురుకాకూడదని బాలయ్య స్పష్టంగా క్రిష్ కు చెప్పి ఆ పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

 స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత  చరిత్రను వెండితెరపై ఆవిష్కరించబోతోంది ‘ఎన్టీఆర్‌’ . నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తూ, నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.  ఈ మూవీలో ఏఎన్నార్‌ పాత్రలో సుమంత్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే.   క్రిష్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు.