చైతూ ‘సవ్యసాచి’ ట్రైలర్ వచ్చేసింది..ఎలా ఉందంటే

నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో  మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎర్నేని నవీన్, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్‌ నిర్మిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’.  నిధి అగర్వాల్‌ హీరోయన్ గా చేస్తున్న ఈ చిత్రం టీజర్ ఇప్పటికే రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. పూర్తి యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ ట్రైలర్ సాగింది. మీరూ ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి. నాగచైతన్య కష్టాన్ని గుర్తిస్తారు. అంతా సవ్యంగా హిట్ కొట్టేలా ఉందంటారు.

https://www.youtube.com/watch?v=An9lC-F_HMg

సీజే వర్క్ వల్ల రిలీజ్ డేట్  కొంత ఆలస్యం అయినా కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో ప్రేక్షకుల్లో దీని మీద మంచి ఆసక్తి నెలకొందనేది నిజం.  రీసెంట్ గా  టీజర్ వదిలి ప్రమోషన్ మొదలుపెట్టిన టీమ్ దసరా నుంచి మరింత వేగం పెంచింది.  నవంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాసం ఉంది.

 సేమ్‌ వపర్‌. రైట్‌ హ్యాండ్‌కి ఎంత పవర్‌ ఉందో.. సేమ్‌ పవర్‌ లెఫ్ట్‌ హ్యాండ్‌కి కూడా ఉందతనికి. మరి ఈ ఎక్స్‌ట్రా పవర్‌తో అతను ఎక్స్‌ట్రీమ్‌గా ఏం
చేశాడో తెలుసుకోవాలంటే ‘సవ్యసాచి’ సినిమా చూడాల్సిందే అంటున్నారు నిర్మాతలు.  కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రావు రమేశ్, వెన్నెల కిశోర్, సత్య, తాగుబోతు రమేశ్‌ తదితరులు నటిస్తున్నారు.  ఈ సినిమాకు కెమెరా: యువరాజ్‌.