స‌రిలేరు నీకెవ్వ‌రు 50 కోట్ల క్ల‌బ్ వైపు!

సంక్రాంతి పందెంలో సునాయాసంగా  వ‌సూళ్లు ద‌క్కుతున్నాయి. వ‌రుస సెల‌వులు అన్ని సినిమాల‌కు ప్ల‌స్ అవుతున్నాయ‌ని తెలుస్తోంది. మ‌హేష్ న‌టించిన `సరిలేరు నీకెవ్వరు` తొలి రోజు 32.64 కోట్ల షేర్ వ‌సూలు చేయ‌గా.. ఇక రెండో రోజు అల వైకుంఠ‌పురం పోటీని త‌ట్టుకుని సుమారు రూ.9.5 కోట్ల షేర్ సాధించింద‌ని తెలుస్తోంది. రెండు రోజుల్లో రూ.42 కోట్ల షేర్ మార్క్ క్రాస్ చేసింది. ఇక ఈ సినిమాకు రు.101 కోట్ల మేర బిబినెస్ చేసిన సంగ‌తి తెలిసిందే.

స‌రిలేరు ఏరియా వైజ్ లెక్క‌లు చూస్తే… ఆంధ్ర – తెలంగాణలో రెండ్రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ప‌రిశీలిస్తే…నైజాం – 12.70 కోట్లు, సీడెడ్ – 5.44 కోట్లు, గుంటూరు – 5.7 కోట్లు, ఉత్తరాంధ్ర – 5.56 కోట్లు, ఈస్ట్ – 4.04 కోట్లు, వెస్ట్ – 3.18 కోట్లు, కృష్ణా – 3.90 కోట్లు, నెల్లూరు – 1.58 కోట్లు వ‌సూలైంది. రెండు రోజుల్లో ఏపీ,  తెలంగాణ నుంచి 42.1 కోట్లు వ‌సూలైంద‌ట‌.