అమెరికాకి సాయిధరమ్.. సినిమా కోసమా లేక సర్జరీ కోసమా?

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తొలినాళ్లలో మంచి సినిమాల్లోనే నటించి పర్వాలేదనిపించాడు. ఈమధ్య అతడు చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. రీసెంట్ గా విడుదల అయిన ‘తేజ్ ఐ లవ్ యూ’ తో మళ్లీ ఫామ్ లోకి రావొచ్చు అనుకుంటే అది కూడా నిరాశే మిగిల్చింది. దీంతో డైలమాలో పడిపోయాడు ఈ యువ కధానాయకుడు. సినిమాల ఎంపిక విషయంలోనే కాదు లుక్ విషయంలో కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు సాయి ధరమ్.

ఇక మీదట లుక్స్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకోవాలి అనుకుంటున్నాడట. తన నెక్స్ట్ మూవీలో లేటెస్టుగా కనిపించాలని ఆలోచిస్తున్నాడు. అందుకే మేకోవర్ కోసం అమెరికా వెళ్లనున్నాడని సమాచారం. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ‘చిత్రలహరి’పై ఫుల్ గా అటెన్షన్ పెట్టేశాడట తేజ్ ఇప్పుడు. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, రితిక సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.