ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస పరాజయాల యువనటుడు సాయిధరమ్ తేజ్ కు ‘చిత్రలహరి’ విజయంతో ఊపిరి పీల్చుకున్నాడు. దాంతో భవిష్యత్ ప్రాజెక్టుల్ని ఎంతో జాగ్రత్తగా మలచుకుంటున్నాడు. ప్రస్తుతం ‘ప్రతిరోజూ పండగే’ ప్రాజెక్టుతో సాయిధరమ్ తేజ్ బిజీగా ఉన్నాడు.
సాయితో సినిమా కోసం చాలాకాలం నుంచి ఎదురు చూసిన మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇది పూర్తయిన వెంటనే దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్న రొమాంటిక్ కామెడీలో నటించనున్నాడు.
దీంతోపాటు మరో రెండు రొమాంటిక్ కామెడీలకీ ఓకే చేప్పేసినట్టు తెలుస్తోంది. అందులో ఒక సినిమాలతో సుబ్బు అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతాడట. మేర్లపాక గాంధీ, సుబ్బు చిత్రాలను ఒకేసారి చేయాలనే తలపుంతో ఉన్నాడట. ఈ రెండు సినిమాల పూర్తి వివరాలు కూడా తెలుస్తాయట. ఏది అయినా మోతాదు ఎక్కువైతే ఇబ్బందే. మరి ఇలా వరుస రొమాంటిక్ కామెడీలు సాయిని కాపాడుతాయంటారా?
