బాలీవుడ్ కి టాలీవుడ్ విసిరిన ఛాలెంజ్

సైరా టీమ్‌కి సాహో ప్ర‌భా విషెస్

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ `సాహో` ట్రైల‌ర్ ఇటీవ‌లే రిలీజైంది. ఈ ట్రైల‌ర్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌భాస్ అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. సాహో ట్రైల‌ర్ గురించి మాట్లాడుకుంటుండ‌గానే నేటి (మంగ‌ళ‌వారం) మ‌ధ్యాహ్నం `సైరా` టీజ‌ర్ ట్రీట్ ని ఇచ్చింది మెగా టీమ్. నేడు ముంబైలో సైరా టీజ‌ర్ ని చిరంజీవి, చ‌ర‌ణ్‌, సురేంద‌ర్ రెడ్డి బృందం రిలీజ్ చేశారు. ఈ టీజ‌ర్ లో విజువ‌ల్ గ్లింప్స్ కి ముంబై మీడియాకి పిచ్చెక్కింది. మెగాస్టార్ చిరంజీవి స‌హా చిత్ర‌బృందానికి ముంబై మీడియా శుభాకాంక్ష‌లు తెలిపింది. ఇన్నాళ్లు సాహో మాత్ర‌మే అనుకుంటే ఇప్పుడు సైరా కూడా పార్టీలో జాయిన్ అయ్యింది. ముంబైకి మునుముందు అదిరిపోయే ట్రీట్ ని రెడీ చేస్తున్న‌ట్టేన‌ని అక్క‌డ మీడియా వాళ్ల‌కు అర్థ‌మైంది. ఒక ర‌కంగా ఇది బాలీవుడ్ కి టాలీవుడ్ విసిరిన‌ ఛాలెంజ్ అనే చెప్పాలి.

<

p style=”text-align: justify”>ఆస‌క్తిక‌రంగా ముంబైలో సైరా టీజ‌ర్ ని ఆవిష్క‌రించిన అనంత‌రం అక్కడ డార్లింగ్ ప్ర‌భాస్ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. సైరా టీమ్ కి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి, చ‌ర‌ణ్ ల‌తో క‌లిసి ప్ర‌భాస్ దిగిన ఫోటో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారుతోంది. సాహో త‌ర్వాత సైరా ఉత్త‌రాది ఆడియెన్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వ‌బోతున్నాయి. పైగా ఆ ఇద్ద‌రూ జ‌త‌క‌లిసి ఒక‌రి సినిమాకి ఒక‌రు ప్ర‌చారం చేస్తే ఎలా ఉంటుందో ఊహిస్తేనే ఇంట్రెస్టింగ్. ప్ర‌భాస్ – చ‌ర‌ణ్ ఇప్ప‌టికే స్నేహితులు కాబ‌ట్టి డ్యూయ‌ల్ ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీని అనుస‌రిస్తే అది కూడా క‌లిసొస్తుందేమో.