‘సాహో’రిలీజ్ ఫిక్స్, ఆ రోజే ఎందుకంటే…!

మొత్తానికి చాలా కాలంగా యంగ్‌ రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సాహో’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఆ రోజునే రిలీజ్ కు ఎంచుకోవటానికి కారణం..ఆ రోజు దేశం మొత్తం శెలవు రోజు అనేది ఓ కారణం అయితే సినిమాలో దేశభక్తికి సంభందించిన కొన్ని ఎలిమెంట్స్ మిళితం కావటం వల్ల కూడా ఆ రోజుని ఫిక్స్ చేసారని తెలుస్తోంది.

ఇందులో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. సుజిత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శంకర్‌-ఎహసాన్‌- లాయ్ త్రయం, తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ, ఎవ్లిన్‌ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు ప్రస్తుతం ప్రభాస్‌ మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. ‘జిల్‌’ ఫేం ఎస్‌. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు ‘అమూర్‌’ అనే ఫ్రెంచ్‌ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక.
‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా భారీ వీఎఫ్ఎక్స్ తో రానుంది.