‘వినయ విధేయ రామ’ ట్రైలర్ పై వర్మ వెటకారం

ఎప్పటిలాగే రామ్ గోపాల్ వర్మ మెగా హీరో సినిమా అనగానే తన కామెంట్స్ తో రెడీ అయ్యపోయారు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ‘వినయ విధేయ రామ’ట్రైలర్ నిన్న రాత్రి రిలీజైంది. ఈ ట్రైలర్ పూర్తి స్దాయి బోయపాటి మార్క్ తో నిండిపోయిందని అందరూ ఒప్పుకున్న సంగతే. ఈ విషయమై వర్మ తనదైన శైలిలో కామెంట్స్ సోషల్ మీడియా ద్వారా వదిలారు.

ఈ ట్రైలర్ అద్బుతం, ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేయాలి. కేజీఎఫ్ తరహాలో డైమండ్స్ కలిసి మరీ ఉంది. జంజీర్ బదులుగా ఈ సినిమాని రామ్ చరణ్ బాలీవుడ్ లో చేసి ఉంటే బాగుండేది..అంటూ తనదైన శైలిలో వ్యంగ్య బాణాలు వదిలారు.

ఇక ఈ ట్రైలర్ లో బోయపాటి బాగా ఓవర్ డోస్ మాస్ ఎలిమెంట్స్, వయిలెన్స్ ని మిక్స్ చేసి వదిలారు. అలాగే స్టోరీ కూడా కాస్తంత ఓల్డ్ గానే అనిపించేలా విజువల్స్ కనిపిస్తున్నాయి. అయితే సరైన సింహం తగలనంతవరకు ప్రతీ వేటగాడు మగాడేరా.. అంటూ చెర్రీ చెప్పిన డైలాగ్‌ అభిమానులకు బాగా నచ్చుతోంది.

రామ్ చరణ్ మాత్రం తనలోని మాస్ యాంగిల్ ని ఎక్సప్లోర్ చేస్తూ విశ్వరూపాన్ని చూపించేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీతమందించారు. భరత్‌ అనే నేను ఫేమ్‌ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. స్నేహ, ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేశ్‌, వివేక్‌ ఒబేరాయ్‌ కీలకపాత్రల్లో నటించారు. జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.