క్రిష్ డెసిషన్..  అఖిల్ కు టెన్షన్

ఎంకి పెళ్లి ..సుబ్బి …కు వచ్చిందన్న సామెత. ఇప్పుడు  అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’టీమ్ పరిస్దితి అలాగే ఉంది.వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న అఖిల్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు. ఇప్పటికే  ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌, ట్రైలర్ ను  విడుదల చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ నేపధ్యంలో సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఆ సమయానికి పూర్తి అయ్యేటట్లు కనపడటం లేదు. దాంతో ఇది కాదు అని ..సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ లోగా ఊహించని విధంగా క్రిష్ సీన్ లోకి వచ్చారు.

తాన తాజా చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తానని ప్రకటించారు. దాంతో ట్రేడ్ దృష్టి మొత్తం అటు టర్న్ అయ్యిపోయింది. అందరూ ఆ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మీడియా మొత్తం ఆ సినిమాపైనే ఫోకస్ పెట్టింది. దాంతో వేరే సినిమాలు ఆ టైమ్ కు రిలీజ్ అయ్యినా పట్టించుకునేవారేకనపడరు. దాంతో అక్కినేని క్యాంప్ కు ఇప్పుడు సంక్రాంతికి విడుదల చెయ్యాలా లేక వాయిదా వేసుకోవాలా..లేదా ముందు అనుకున్నట్లు డిసెంబర్ లో వచ్చేయాలా అనే డైలమో మొదలైంది.

‘తొలి ప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.