ఆగష్టు 4 న రానున్న రణరంగం ట్రైలర్

శర్వానంద్ హీరోగా కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు గా నటించిన చిత్రం రణరంగం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకుడు.

ఈ చిత్రం ట్రైలర్ ను ఈ నెల 4 న దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా కాకినాడలో విడుదల చేయనున్నట్టు దర్శకనిర్మాతలు ప్రకటించారు.

మాఫియా నేపధ్యంలో సాగిన ఈ చిత్రం ఈ నెల 15 న విడుదల అవుతుంది.ఈ చిత్రంలో శర్వానంద్ ద్విపాత్రాభినయం చేశారు.