నేను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పానా..
టాలీవుడ్ మ్యాచో హీరో రానా దగ్గుబాటి అనారోగ్యంతో బాధపడుతున్నారని.. అతడు పూర్తిగా పీలగా తయారయ్యారని అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. తాజాగా ఓ కమర్షియల్ ప్రకటనలో కనిపించిన రానాను చూసి మరీ అంత సన్నగా అయ్యాడేమిటో అంటూ ఆందోళనకు గురయ్యారు ఫ్యాన్స్. అసలు మీ ఆరోగ్యం విషయంలో ఏం జరుగుతోంది? అంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. మరీ అంత సన్నగా అయ్యారు కారణమేమిటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు సోషల్ మీడియాలో.
దీనికి దగ్గబాటి హీరో తాజాగా స్పందించారు. ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాతో ముచ్చటిస్తూ తన ఆరోగ్యానికి వచ్చిన డోకా ఏమీ లేదని అన్నారు. దాని గురించి మాట్లాడడం బోరింగ్ టాపిక్ అని కొట్టి పడేశారు. నేను క్షేమంగా ఉన్నాను. అందుకు సంబంధించి ఇంతకుముందే వివరణ ఇచ్చానని తెలిపారు. కిడ్నీ మార్పిడి చికిత్స అంటూ సాగిన ప్రచారంపైనా వివరణ ఇచ్చానని అన్నాడు రానా. తాను ఊరు వదిలి వెళితే వెంటనే అభిమానులు సందేహిస్తున్నారని అదంతా వారి ప్రేమకు నిదర్శనమని అన్నారు. తాజా ప్రచారాన్ని మరోసారి రానా ఖండించారు. తాను సేఫ్ గా ఆరోగ్యంగానే ఉన్నానని రానా తెలిపారు. పదే పదే ఆ విషయంపై మాట్లాడడం బోర్ కొట్టిస్తోందని అన్నారు. ఇలాంటి రూమర్లు పుట్టించినా వారికి ధన్యవాదాలు చెబుతానని అన్నారు.
రానా నటించిన హౌస్ ఫుల్ 4 రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ చిత్రంలో తోడేలుతో పోరాడే భీకర విలన్ గా కనిపించారు రానా. దీంతో పాటే సౌత్ లో పలు భారీ చిత్రాల్లో రానా నటిస్తున్నారు. హిరణ్ కసిప సెట్స్ కి వెళ్లాల్సి ఉంది. అలానే హాథీ మేరా సాథీ చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది.

