మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్ !

Pawan Kalyan

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జోరు మాములుగా లేదు. వరుస పెట్టి సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమాను కంప్లీట్ చేసాడు. తొలిసారి లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయాల్సి ఉన్నా, ముందుగా మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా.

మ‌రో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్..!

మల్లూవుడ్‌లో బిజూ మీనన్, పృథ్వీరాజ్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బిజూ మీనన్ పాత్రలో నటిస్తుండగా, రానా దగ్గుబాటి పృథ్వీరాజ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారని సమాచారం. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు.

దీంతో పాటు పవన్ కళ్యాణ్.. క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలతో పాటు బండ్ల గణేష్ నిర్మాణంలో సినిమాలు చేయడాకి ఒప్పుకున్నాడు. ఈ కోవలో పవన్ కళ్యాణ్ మరో క్రేజీ దర్శకుడు చెప్పిన కథకు ఒకే చెప్పినట్టు సమాచారం.ఇప్పుడు బండ్ల‌గ‌ణేష్ నిర్మాణంలో రాక్ష‌సుడు ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మతో సినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ర‌మేష్ వ‌ర్మ ప్ర‌స్తుతం ర‌వితేజ హీరోగా ఖిలాడీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యాక ప‌వన్ సినిమా ప‌నులు మొద‌లు పెడ‌తాడ‌ట‌.