రానా పాన్ ఇండియన్ సినిమాకి ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ ..?

ప్రస్తుతం రానా దగ్గుబాటి విరాట పర్వం అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ప్రియమణి, సాయి పల్లవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నెలలో మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం. ఇక ఇప్పటికే ప్రభు సాలొమెన్ దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు, హిందీ, తమిళ చిత్రం అరణ్య రిలీజ్ కి రెడీగా ఉంది. కాగా రానా డ్రీం ప్రాజెక్ట్ అయిన హిరణ్య కశిప సినిమా విషయంలో క్లారిటీ రావడం లేదు. ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ వస్తోంది.

రానా పాన్ ఇండియన్ సినిమాకి ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ ..?

గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కాగా టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ శేఖర్ కి ఉన్న క్రేజ్ అందరికీ తెల్సిందే. గుణశేఖర్ తెరకెక్కించే సినిమాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి వాళ్ళతో అధ్బుతమైన సినిమాలు తీసి సెన్షేనల్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే రానా తో హిరణ్య కశిప సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. అంతేకాదు గుణశేఖర్ ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్లు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పనిచేసారు. అయితే కరోనా కారణంగా పరిస్థితులన్ని మారిపోవడం తో ఈ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడింది.

Trivikram's involvement in Rana's big-budget project | TeluguBulletin.com

కాగా రానా – గుణ శేఖర్ కాంబినేషన్ లో ‘హిరణ్యకశ్యప’ మళ్ళీ పట్టాలెక్కడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం గుణ శేఖర్ ఈ సినిమా తర్వాత రానా తో ‘హిరణ్యకశ్యప’ సినిమా చేయనున్నాడని అందుకు కూడా ఒకవైపునుంచి పనులు ప్రారంభించినట్టు సమాచారం. వాస్తవంగా ఈ సినిమా ‘శాకుంతలం’ కంటే ముందే స్టార్ట్ అవ్వాల్సింది. కాగా ‘హిరణ్యకశ్యప’ సినిమాకి మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ తో డైలాగ్స్ రాయించాలన్న ఆలోచనలో గుణశేఖర్ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయట. త్వరలో ఈ విషయంలో క్లారిటీ రానుందని తెలుస్తోంది.