రహస్యంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ” షూటింగ్ .

రాంగోపాల్ వర్మ తిరుపతిలో “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” చిత్రం షూటింగ్ ముహూర్తం చేసిన తరువాత మళ్ళీ ఎలాటి వార్త లేదు .
రాంగోపాల్ వర్మ ఎప్పుడూ వార్తల్లో ఉండటానికి ప్రయత్నిస్తాడు . మంచైనా ,చెడైనా వార్త ప్రధాన అని భావిస్తాడు . తిరుపతి తరువాత వర్మ సైలెంట్ అయిపోయాడేమిటి అనుకుంటున్నారు . కానీ “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమా షూటింగ్ ను హైద్రాబాద్లో చాలా రహస్యంగా జరుపుతున్నాడట . ఈ సినిమా షూటింగ్ విషయంలో వర్మ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట . ఏ విషయం బయటకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నాడట .
ఏ పాత్రకు ఎవరిని ఎంపిక చేసింది తెలియడం లేదు . తిరుపతిలో అందరిని కొత్త వారిని తీసుకుంటున్నాని చెప్పినా , పాత నటీనటులు కూడా ఉండ వచ్చని అంటున్నారు .

ఈ షూటింగ్ లో మొబైల్ ఫోన్లు అస్సలు అనుమతించడం లేదట . గెస్టులను రానీయడం లేదట . కట్టుదిట్టమైన భద్రత మధ్య షూటింగ్ చేస్తున్నట్టు తెలిసింది . ఈ చిత్రాన్ని బాలకృష్ణ చిత్రానికి పోటీగా విడుదల చెయ్యబోతున్నాడు .