మెగా పవర్స్టార్ రామ్చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం‘వినయ విధేయ రామ’ట్రైలర్ వచ్చేసింది.ఈ చిత్రం పూర్తి స్దాయి యాక్షన్ ఎంటర్టైనర్ అని తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ని బట్టి అర్దమవుతోంది.దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించి ట్రైలర్ను విడుదల చేశారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్కు ఓ రేంజిలో రెస్పాన్స్ రావటంతో సినిమా అంచనాలు పెరిగిపోయాయి. బోయపాటి మాస్ టేకింగ్, రామ్చరణ్ యాక్షన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
అయితే ఈ ట్రైలర్ లో బోయపాటి బాగా ఓవర్ డోస్ మాస్ ఎలిమెంట్స్, వయిలెన్స్ ని మిక్స్ చేసి వదిలారు. అలాగే స్టోరీ కూడా కాస్తంత ఓల్డ్ గానే అనిపించేలా విజువల్స్ కనిపిస్తున్నాయి. అయితే సరైన సింహం తగలనంతవరకు ప్రతీ వేటగాడు మగాడేరా.. అంటూ చెర్రీ చెప్పిన డైలాగ్ మాస్కు బాగా ఎక్కేసేలా ఉంది.
రామ్ చరణ్ మాత్రం తనలోని విశ్వరూపాన్ని చూపించేశారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతమందించారు. భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీ హీరోయిన్గా నటించారు. స్నేహ, ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, వివేక్ ఒబేరాయ్ కీలకపాత్రల్లో నటించారు. జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.