మెగా పవర్స్టార్ రామ్చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం‘వినయ విధేయ రామ’.ఈ చిత్రం పూర్తి స్దాయి యాక్షన్ ఎంటర్టైనర్ అని మొన్న రిలీజ్ చేసిన టీజర్ ని బట్టి అర్దమవుతోంది. ‘అన్నయ్యా..వీడిని చంపేయాలా? భయపెట్టాలా?’ భయపెట్టాలంటే పది నిమిషాలు, చంపేయాలంటే పావుగంట.. ఏదైనా ఓకే. సెలెక్ట్ చేస్కో’ అంటూ రామ్చరణ్ స్టైల్గా నడుచుకుంటూ వస్తూ చెప్తున్న డైలాగ్తో టీజర్ మొదలైంది. దాంతో ఈ చిత్రం పక్కా యాక్షన్ సినిమా అని ఫిక్స్ అయ్యారు.
అయితే పూర్తి యాక్షన్ అంటే ఫ్యామిలీస్ దూరం పెడతారని ఆలోచించిన దర్శకుడు బోయపాటి ..ఫ్యామిలీస్ ని ఆకట్టుకునే ఆంశాలు ఉన్నాయని ప్రమోట్ చెయ్యాలని ఫిక్సైంది. అందులో భాగంగా..ఈ చిత్రానికి సంభందించి పోస్టర్స్ విడుదల చేసింది. అయితే ఒక సారి ఇది పక్కా మాస్ యాక్షన్ సినిమా అని చెప్పిన తర్వాత ఇలాంటి పోస్టర్స్ విడుదల చేసినా ఎంతవరకూ ఇంపాక్ట్ చూపుతాయో ..వేచి చూడాలి.
మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రామ్చరణ్కు జోడీగా కియారా అడ్వాణీ నటించారు. ఇటీవల సినిమా షూటింగ్ పూర్తయింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రామ్చరణ్ కొత్త లుక్లో ఆకట్టుకోనున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.