రకుల్ స్కిప్ కొట్టడానికి కారణమేమిటో?
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ (మేనేజర్లు)ల అసోసియేషన్ ప్రారంభించి పాతిక సంవత్సరాలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవి, సూపర్స్టార్ మహేష్, రెబల్స్టార్ కృష్ణంరాజు, చిన్నజీయార్ స్వామి వంటి ప్రముఖుల సమక్షంలో భారీగా రజతోత్సవ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో పూజా హెగ్డే, రాశీఖన్నా, దేవీశ్రీ, అనసూయ తదితరులు అదిరిపోయే డ్యాన్సులతో ఫ్యాన్స్ కి ట్రీటిచ్చారు.
కోపం వస్తే అంతేనా? ఇదేమిటమ్మడూ?
అయితే ఇదే ఈవెంట్లో పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉండగానే మధ్యలోనే ఆర్గనైజర్లకు చెప్పా పెట్టకుండా జంప్ అయిపోయిందని తెలుస్తోంది. అయితే వేడుకకు విచ్చసీ.. తాను వెళ్లిపోతున్నట్టు కనీస ఇంటిమేషన్ లేకుండా స్కిప్ కొట్టేయడంతో ఆ మ్యాటర్ కాస్తా జోరుగా ఫిలింసర్కిల్స్ లోకి గుప్పుమంది. వక్తల స్పీచ్ ల నడుమ ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సొచ్చింది. అయితే ఎంతసేపు వేచి చూసినా తనకు పెర్ఫామెన్స్ ఇచ్చేందుకు స్కోప్ దొరకలేదు. మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ ఇచ్చే ముందే రకుల్ పెర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉండగా.. చిరుని వేదికపైకి పిలిచారు యాంకర్లు. ఆ తర్వాత ఇక వెయిట్ చేయలేక రకుల్ జంప్ అయిపోయిందట. సరైన ఆర్గనైజేషనల్ స్కిల్ లేకపోతే ఇలానే జరుగుతుందనడానికి ఎన్నో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే రకుల్ కి ఎదురైన అనుభవం చాలామందికి ఎదురవుతుంటుంది. ఇక ఈ వేదిక వద్ద సమయాభావం వల్ల చాలా కామెడీ స్కిట్లను చేయకుండా మధ్యలోనే కట్ చేసేశారని తెలుస్తోంది.
