హిమాల‌యాలకు సూప‌ర్ స్టార్

గ‌త కొంత కాలంగా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హిమాల‌యాల‌కు వెళుతున్న విష‌యం తెలిసిందే. ఈ సారి కూడా ఆయ‌న హిమాల‌యాల‌కు వెళ్ల‌బోతున్నారు. సినిమా పూర్త‌యిన త‌రువాత మ‌రో సినిమా ప్రారంభానికి నెల ముందు త‌లైవా రిలాక్స్ కోసం హిమాల‌యాల‌కు వెళుతుంటారు. ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం ఏ.ఆర్‌. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌తున్న యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్ ద‌ర్బార్‌లో న‌టిస్తున్నారు. 2.ఓ సినిమా త‌రువాత లైకా ప్రొడ‌క్ష‌న్స్ ర‌జ‌నీతో నిర్మిస్తున్న చిత్ర‌మిది. ర‌జ‌నీ చాలా ఏళ్ల త‌రువాత పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ర‌జ‌నీకి జోడీగా లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లే పూర్త‌యింది. దీంతో రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోవాల‌ని ప్లాన్ చేసుకున్న ర‌జ‌నీ రెండు రోజుల క్రితం త‌న కూతురు ఐశ్వ‌ర్యా ధ‌నుష్‌తో క‌లిసి నప్ర‌త్యే విమానంలో రిషీకేష్‌లోని ఆశ్ర‌మానికి వెళ్లిపోయారు. రిషీకేష్‌లో ధ్యానానంద స‌ర‌స్వ‌తిని ఆశ్ర‌మాన్నివిజిట్ చేసిన ర‌జ‌నీ అక్క‌డే ఆధ్యాత్మిక గురువుని క‌లుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ధ్యాన గురువుతో ర‌జ‌నీ ఫొటోల‌కు పోజిచ్చిన స్టిల్స్‌తో పాటు ధ్యానానంద స‌ర‌స్వ‌తి ఆశ్రమానికి వ‌చ్చిన త‌న అభిమానుల‌తో ర‌జ‌నీ ఓపిక‌గా ఫొటోలు దిగారు. ప‌ది రోజుల పాటు ర‌జ‌నీ ఆధ్యాత్మిక టూర్ కొన‌సాగుతుంద‌ని, చివ‌రికి ఆయ‌న హిమాల‌యాల్లో వున్న త‌న గురువు వ‌ద్ద‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్న త‌రువాత ర‌జ‌నీ తిరిగి చెన్నై చేరుకోనున్నార‌ని, ఆ త‌రువాతే సిరుతై శివ 168వ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని తెలిసింది. ర‌జ‌నీ న‌టిస్తున్న ద‌ర్బార్‌. పొంగ‌ల్‌కు రానున్న ఈ చిత్రంలో ర‌జ‌నీ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు.