మరోసారి “ఆకాశ్ “తో పూరి ప్రయోగం

ఎవరికైనా నమ్మకం ఉండొచ్చు కానీ అతి నమ్మకం వుండకూడదు అంటారు . అయితే సినిమా దర్శకులు ఎప్పుడు వాస్తవం కన్నా ఊహలకే ప్రాధాన్యత నిస్తారు . వారు తీసుకునే కథలు వాస్తవానికి దూరంగా ఉంటాయి . హీరో పాత్రను వారి ఆలోచనలకు అనుగుణ్యంగా మలుస్తారు .

ఇక వారి హీరో మార్కెట్ ను పరిజ్ఙానలోకి తీసుకోకుండా కోట్లు ఖర్చు పెడతారు . ఆ సినిమా కుప్పకూలినప్పుడు మాత్రమే వాస్తవంలోకి వస్తారు .

కొంత మంది దర్శకులు వారి స్వంత సినిమా విషయంలో కూడా వాస్తవాన్ని గ్రహించారు . ఈ కోవలోకి ఇప్పడు పూరి జగన్నాథ్ వచ్చాడు .

తాజాగా తన కుమారుడు ఆకాశ్ పూరీని నిలబెట్టడానికి మరో సినిమా చెయ్యబోతున్నాడు . అయితే ఈ సినిమాకు అనిల్ అనే కొత్త దర్శకుడును ఎంపిక చేసుకున్నట్టు సమాచారం . ఈ సినిమాకు పూరి జగన్నాథ్ నిర్మాత మాత్రమే .

పూరి జగన్నాథ్ తన కొడుకుతో “మెహబూబా ” అనే చిత్రం తీసి వూహించనంతగా ఆర్ధికంగా నష్టపోయాడు . ఇంకా ఆ దెబ్బ నుంచి కోలుకోలేదు అంటారు . దర్శకుడుగా కూడా పూరికి అవకాశాలు రావడం లేదు . తన కొడుకు ఆకాశ్ తో సినిమాలు తీసేవారు కూడా కనుచూపు మేరలో కానీ పించడం లేదు . అందుకే తన కొడుకు తో మరో సినిమా తీయడానికి సంకల్పించాడట .

ఈ సినిమా కు “వాస్కో డ గామా ” అన్న టైటిల్ ఖరారు చేశారని అంటున్నారు . ఇక ఆకాశ్ పక్కన  నటించడానికి ఢిల్లీ అమ్మాయి గాయత్రి భరద్వాజ అనే మోడల్ను ఎంపిక చేశారట . ఈమె మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్ ” పోటీల్లో గెలుపొందినదని , ఆకాశ్ పూరి పక్కన బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఎంపిక చేశారట . ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ లో మొదలవుతుందట .

పూరీ జగన్నాథ్ నిర్మాతగానైనా విజయం సాధిస్తారా ?