ఏంటి క్రిష్ ఇలా చేసావు… నిర్మాత కూడా పరార్

                                                                     (సూర్యం)

‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘కంచె’ , గౌతమి పుత్ర శాతకర్ణి అంటూ తెలుగులో వరస హిట్స్ ఇస్తూ వచ్చిన  డైరక్టర్ క్రిష్ కు ఫిల్మ్ సర్కిల్స్ లో మంచి పేరే ఉంది. అందుకే ఆయన్ని బాలీవుడ్ ఆఫర్స్ కూడా వెతుక్కుంటూ వచ్చాయి. ఆ మధ్యన అక్షయ్ తో గబ్బర్ తీసిన క్రిష్ కొద్ది కాలం క్రితం కంగనా రనత్ తో.. ‘మణికర్ణిక’ ప్రాజెక్టు మొదలెట్టారు. 

వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ జరిగాక… కంగనాకు ఆయన తీసిన సీన్స్ నచ్చలేదట. దాంతో  వాటిని రీషూట్ చేయాల‌ని కోరింది. కానీ అప్ప‌టికే క్రిష్ ..ఎన్టీఆర్ బ‌యోపిక్ కమిటయ్యారు. దాంతో  బై చెప్పేసి… మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి అంటూ ఆయన డైరక్షన్ భాధ్యతలు అప్పచెప్పి తెలుగుకు వచ్చేసారు.

ఇక్కడ బాలయ్యతో ‘యన్టీఆర్‌’ సినిమాతో చేస్తున్నారు. దాంతో కంగనా ఆ సినిమాని డైరక్షన్ చేయటం మొదలెట్టింది. అయితే ఆమె బిహేవియర్ నచ్చక…ఆర్టిస్ట్ లు తప్పుకోవటం మొదలెట్టారు. వారిలో ప్రముఖంగా సోనూ సూద్ ఉన్నారు. ఆ సినిమాకు ఉన్న మెయిన్ ఆర్టిస్ట్ లలో ఆయన ఒకరు. ఆమెకు డైరక్షన్ చేయటం చేతకాక పోవటంతో తాను తప్పుకున్నా అన్నారు.

సరే అనుకుని  వేరే ఆర్టిస్ట్ ని తీసుకుని వచ్చి సినిమా పూర్తి చేద్దామని మొదలెట్టిందామె. అయితే ఇప్పుడు నిర్మాత సంజయ్ కుట్టి కూడా నమస్కారం పెట్టేసాడు. దాంతో వేరే నిర్మాతలు టేకోవర్ చేస్తున్నట్లు సమాచారం. బడ్జెట్ పెరిగిపోవటం, డైరక్టర్ మారటం, షూటింగ్ లు వాయిదాలు పడటం, కంగనా సెట్ లో బిహేవ్ చేసే తీరు నచ్చకపోవటం వంటి రకరకాల కారణాలతో నిర్మాతలు తప్పుకున్నారు. అదేదో క్రిష్ కంటిన్యూ అయ్యి ఉంటే ఈ సమస్యలు వచ్చేవి కాదు అంటున్నారు బాలీవుడ్ సినిమా జనం.